భారతీయుల 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకి ధోనీసేన తెరదించి నేటితో సరిగ్గా 7 ఏళ్లు. 1983లో తొలిసారి ప్రపంచకప్ని ముద్దాడిన భారత్.. ఆ తర్వాత చాలాసార్లు సమీపానికి వెళ్లి బోల్తా కొట్టింది. అయితే.. 2011లో సొంత గడ్డపై జరిగిన ప్రపంచకప్లో అసాధారణ రీతిలో ప్రత్యర్థులపై విరుచుకుపడిన భారత్.. ఎట్టకేలకి మళ్లీ కప్ని చేజిక్కించుకోగలిగింది. మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు.. క్లిష్ట మ్యాచ్ల్లోనూ చూపిన తెగువకి దేశం మొత్తం నీరాజనం పలికింది.
2011, ఏప్రిల్ 2న వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆ జట్టులో మహేల జయవర్దనె (103: 88 బంతుల్లో 13x4) అజేయ శతకంతో రాణించాడు. ఫైనల్ కావడంతో.. 270+ భారత్కి చాలా పెద్దదిగా కనిపించింది.
అప్పటి వరకు టోర్నీలో తాను ఆడిన తొలి బంతినే బౌండరీకి తరలిస్తూ భారత్కి మెరుగైన ఆరంభాలిచ్చిన వీరేంద్ర సెహ్వాగ్ (0) తొలి ఓవర్లోనే డకౌటయ్యాడు. అనంతరం కొద్దిసేపటికే సచిన్ టెండూల్కర్ (18) కూడా పెవిలియన్ బాట పట్టడంతో భారత్ 31/2తో ఒత్తిడిలో పడిపోయింది. ఈ దశలో క్రీజులో ఒంటరి పోరాటం చేసిన గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9x4) శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతనికి కాసేపు అండగా నిలిచిన విరాట్ కోహ్లి (35) పేలవ రీతిలో ఔటవగా.. అనంతరం వచ్చిన మహేంద్రసింగ్ ధోనీ (91: 79 బంతుల్లో 8x4, 2x6) చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ భారత జట్టుని విజయతీరాలకి చేర్చేవరకూ పట్టువీడలేదు. అయితే.. శతకం ముంగిట గంభీర్ ఔటవగా.. చివర్లో యువరాజ్ సింగ్ (21 నాటౌట్)తో కలిసి ధోనీ చరిత్రాత్మక సిక్స్తో భారత్కి కప్ను అందించాడు. టీమిండియా 48.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
2011, ఏప్రిల్ 2న వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆ జట్టులో మహేల జయవర్దనె (103: 88 బంతుల్లో 13x4) అజేయ శతకంతో రాణించాడు. ఫైనల్ కావడంతో.. 270+ భారత్కి చాలా పెద్దదిగా కనిపించింది.
అప్పటి వరకు టోర్నీలో తాను ఆడిన తొలి బంతినే బౌండరీకి తరలిస్తూ భారత్కి మెరుగైన ఆరంభాలిచ్చిన వీరేంద్ర సెహ్వాగ్ (0) తొలి ఓవర్లోనే డకౌటయ్యాడు. అనంతరం కొద్దిసేపటికే సచిన్ టెండూల్కర్ (18) కూడా పెవిలియన్ బాట పట్టడంతో భారత్ 31/2తో ఒత్తిడిలో పడిపోయింది. ఈ దశలో క్రీజులో ఒంటరి పోరాటం చేసిన గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9x4) శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతనికి కాసేపు అండగా నిలిచిన విరాట్ కోహ్లి (35) పేలవ రీతిలో ఔటవగా.. అనంతరం వచ్చిన మహేంద్రసింగ్ ధోనీ (91: 79 బంతుల్లో 8x4, 2x6) చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ భారత జట్టుని విజయతీరాలకి చేర్చేవరకూ పట్టువీడలేదు. అయితే.. శతకం ముంగిట గంభీర్ ఔటవగా.. చివర్లో యువరాజ్ సింగ్ (21 నాటౌట్)తో కలిసి ధోనీ చరిత్రాత్మక సిక్స్తో భారత్కి కప్ను అందించాడు. టీమిండియా 48.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.