భారత్, వెస్టిండీస్ మధ్య ఈనెల 24న జరగనున్న రెండో వన్డేకి ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని అనూహ్యంగా చేజిక్కించుకున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఇప్పుడు ఆ వన్డేని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా.. ప్రేక్షకుల్ని పెద్ద ఎత్తున విశాఖపట్నం స్టేడియానికి రప్పించేందుకు మ్యాచ్ టికెట్ల ధరని భారీగా తగ్గించింది. వాస్తవానికి ఈ వన్డే ఇండోర్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ.. కాంప్లిమెంటరీ పాస్ల విషయంలో బీసీసీఐ, మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపీసీఏ) మధ్య వివాదం చెలరేగడంతో.. ఆ అవకాశాన్ని వైజాగ్ చేజిక్కించుకుంది.
‘రెండో వన్డే కోసం రూ. 6,000 ఉన్న టికెట్ ధరని రూ. 4,000 తగ్గించిన ఏసీఏ.. రూ. 3,500 ఉన్న వాటిని రూ.2,500కి, 2,500 ఉన్న వాటిని రూ.2,000కే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు రూ. 1,800, 1,200, 750, 250 టికెట్లని కూడా అందుబాటులో ఉంచింది’ అని ఓ ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. స్టేడియం సామర్థ్యానికి అనుగుణంగా.. 24,000 టికెట్లను ఈనెల 15 నుంచి అభిమానుల కోసం అమ్మకానికి ఉంచనున్నట్లు ఏసీఏ ప్రకటించింది. మిగిలిన 3,500 టికెట్లను కాంప్లిమెంటరీ పాస్ల కింద కేటాయించినట్లు తెలుస్తోంది.
‘రెండో వన్డే కోసం రూ. 6,000 ఉన్న టికెట్ ధరని రూ. 4,000 తగ్గించిన ఏసీఏ.. రూ. 3,500 ఉన్న వాటిని రూ.2,500కి, 2,500 ఉన్న వాటిని రూ.2,000కే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు రూ. 1,800, 1,200, 750, 250 టికెట్లని కూడా అందుబాటులో ఉంచింది’ అని ఓ ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. స్టేడియం సామర్థ్యానికి అనుగుణంగా.. 24,000 టికెట్లను ఈనెల 15 నుంచి అభిమానుల కోసం అమ్మకానికి ఉంచనున్నట్లు ఏసీఏ ప్రకటించింది. మిగిలిన 3,500 టికెట్లను కాంప్లిమెంటరీ పాస్ల కింద కేటాయించినట్లు తెలుస్తోంది.