టీమిండియాతో ‘టై’, మాకు విజయమే: అఫ్గాన్ కెప్టెన్
చివరివరకూ ఉత్కంఠ నెలకొన్న మ్యాచ్ టైగా ముగిసింది. స్కోర్లు సమం కావడంతో రెండు జట్లకు చెరో పాయింట్ దక్కింది.
Samayam Telugu 26 Sep 2018, 12:23 pm
ఆసియా కప్లో భాగంగా అఫ్గానిస్థాన్తో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో టీమిండియాను విజయం దోబూచులాడింది. మరో బంతి మిగిలుండానే భారత్ ఆలౌట్ కావడంతో సంబరాలు చేసుకోవడం అఫ్గానిస్థాన్ జట్టు వంతైంది. ఆసియా కప్లో గత 10 మ్యాచ్లలో ఓటమనేది లేకుండా దూసుకెళ్తున్న టీమిండియాకు తొలుత అఫ్గాన్ జట్టు షాకిచ్చేలా కనిపించింది. కానీ చివరివరకూ ఉత్కంఠ నెలకొన్న మ్యాచ్ టైగా ముగిసింది. స్కోర్లు సమం కావడంతో రెండు జట్లకు చెరో పాయింట్ దక్కింది.
టీమిండియా లాంటి పటిష్ట జట్టుతో మ్యాచ్ను టైగా ముగించడంపై అప్గానిస్థాన్ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ హర్షం వ్యక్తం చేశాడు. ‘టాస్ గెలిచి బ్యాటింగ్ చేశాం. పిచ్ మాకు ఎంతో సహకరించింది. ఓపెనర్ మహ్మద్ షహజాద్ అద్భుతంగా ఆడాడు. కానీ కీలక ఆటగాళ్లు స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యారు. అయినా షహజాద్ పోరాటం, నబీ హాఫ్ సెంచరీ వల్ల ఓ మోస్తరు స్కోరు సాధించాం. ఆపై మా బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు రాణించారు. భారత్ లాంటి జట్టుతో మ్యాచ్ టై చేసుకోవడమంటే మాకు విజయం లాంటిదే. సులభంగా ఛేదించాల్సిన స్కోరు చేయకుండా భారత బ్యాట్స్మన్లను మా బౌలర్లు కట్టడిచేశారు. అఫ్గాన్ అభిమానులు ఎంతో సంతోషిస్తారని’ మ్యాచ్ అనంతరం అస్గర్ వివరించాడు.
మంగళవారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేయగా, ఛేజింగ్కు దిగిన భారత్ అదే స్కోరు వద్ద మరో బంతి మిగిలుండగానే ఆలౌటైంది. భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌటైంది. కాగా, ఆసియా కప్ సూపర్-4 ఆఖరి మ్యాచ్లో పాకిస్థాన్-బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఇందులో గెలిచే జట్టు శుక్రవారం జరిగే ఫైనల్లో భారత్తో తలపడనుంది.
టీమిండియా లాంటి పటిష్ట జట్టుతో మ్యాచ్ను టైగా ముగించడంపై అప్గానిస్థాన్ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ హర్షం వ్యక్తం చేశాడు. ‘టాస్ గెలిచి బ్యాటింగ్ చేశాం. పిచ్ మాకు ఎంతో సహకరించింది. ఓపెనర్ మహ్మద్ షహజాద్ అద్భుతంగా ఆడాడు. కానీ కీలక ఆటగాళ్లు స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యారు. అయినా షహజాద్ పోరాటం, నబీ హాఫ్ సెంచరీ వల్ల ఓ మోస్తరు స్కోరు సాధించాం. ఆపై మా బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు రాణించారు. భారత్ లాంటి జట్టుతో మ్యాచ్ టై చేసుకోవడమంటే మాకు విజయం లాంటిదే. సులభంగా ఛేదించాల్సిన స్కోరు చేయకుండా భారత బ్యాట్స్మన్లను మా బౌలర్లు కట్టడిచేశారు. అఫ్గాన్ అభిమానులు ఎంతో సంతోషిస్తారని’ మ్యాచ్ అనంతరం అస్గర్ వివరించాడు.
మంగళవారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేయగా, ఛేజింగ్కు దిగిన భారత్ అదే స్కోరు వద్ద మరో బంతి మిగిలుండగానే ఆలౌటైంది. భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌటైంది. కాగా, ఆసియా కప్ సూపర్-4 ఆఖరి మ్యాచ్లో పాకిస్థాన్-బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఇందులో గెలిచే జట్టు శుక్రవారం జరిగే ఫైనల్లో భారత్తో తలపడనుంది.