యాప్నగరం

మా స్పిన్నర్లే మ్యాచ్‌ని తిప్పారు..!

పల్లెకలె టెస్టులో భారీగా అంచనాలు పెట్టుకున్న ఫాస్ట్ బౌలర్లు విఫలమైనా.. స్పిన్నర్లు తొలి రోజు భారత్ ఆధిపత్యానికి చెక్

TNN 12 Aug 2017, 8:39 pm
పల్లెకలె టెస్టులో భారీగా అంచనాలు పెట్టుకున్న ఫాస్ట్ బౌలర్లు విఫలమైనా.. స్పిన్నర్లు తొలి రోజు భారత్ ఆధిపత్యానికి చెక్ చెప్పగలిగారని శ్రీలంక బౌలింగ్ కోచ్ చమిందా వాస్ ఆనందం వ్యక్తం చేశారు. తొలి సెషన్‌లో ఓపెనర్లు శిఖర్ ధావన్ (119: 123 బంతుల్లో 17x4), లోకేశ్ రాహుల్ (85: 135 బంతుల్లో 8x4) ధాటిగా ఆడటంతో లంక పేస్ బౌలర్లు లయ తప్పి పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా శిఖర్ ధావన్ వన్డే తరహా ఆటతో స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. దీంతో 188 పరుగుల వరకు లంకేయులకి తొలి వికెట్ దక్కలేదు. అయితే.. రెండో సెషన్‌లో పుష్పకుమార, స్పిన్నర్ సందకన సత్తాచాటి భారత్ బ్యాట్స్‌మెన్‌ని ఒత్తిడిలోకి నెట్టి వికెట్లు పడగొట్టారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేయగలిగింది.
Samayam Telugu to do justice to our cricket need to make pitches suiting fast bowlers vaas
మా స్పిన్నర్లే మ్యాచ్‌ని తిప్పారు..!


‘తొలి సెషన్‌లో ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్ ప్రదర్శనపై నేను సంతోషంగా లేను. వాళ్లకి ఈ పిచ్‌పై అనుభవం ఉన్నా విఫలమయ్యారు. పేసర్ లాహిరు కెరీర్‌లో ఆరో మ్యాచ్ ఆడుతున్నాడు.. కానీ.. వేగంగా లయ అందుకోలేకపోయాడు. అయితే లంచ్ బ్రేక్ తర్వాత క్రమంగా బౌలర్లు పుంజుకున్నారు. ముఖ్యంగా స్పిన్నర్లు. వారు మెరవడంతోనే భారత్‌ని 329కే తొలి రోజు పరిమితం చేయగలిగాం. కెరీర్‌లో రెండో మ్యాచ్ ఆడుతున్న విశ్వ చివరి సెషన్‌లో ఫర్వాలేదనిపించాడు. మొత్తంగా స్పిన్నర్ల ప్రదర్శనే నాకు సంతోషానిచ్చింది’ అని చమిందా వాస్ వెల్లడించాడు. గాలె టెస్టులో తొలి రోజే భారత్ 399 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.