యాప్నగరం

డోంట్ కేర్.. కోహ్లికి అందుకే విశ్రాంతిచ్చాం: రవిశాస్త్రి

నా బాధ్యతలకు పూర్తి న్యాయం చేసినంత వరకు నా ఉద్యోగం గురించి బాధపడను. ఎవరేం విమర్శించారో నేను పట్టించుకోను - రవిశాస్త్రి.

Samayam Telugu 2 Oct 2018, 4:17 pm
టీమిండియా చెత్త ప్రదర్శన చేసినప్పుడల్లా కోచ్ రవిశాస్త్రి టార్గెట్ అవుతుంటాడు. ఇటీవల భారత జట్టు ఇంగ్లాండ్ గడ్డ మీద 1-4తో టెస్ట్ సిరీస్ కోల్పోయాక.. మాజీలు శాస్త్రిపై ఫైర్ అయ్యారు. కోచ్ పదవి నుంచి అతడు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కుంబ్లే నుంచి కోచ్ బాధ్యతలను స్వీకరించిన శాస్త్రి ఆరంభం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఓటములకు కోచ్ బాధ్యత వహించాలని సౌరభ్ గంగూలీ డిమాండ్ చేయడాన్ని బట్టే అతడి పట్ల అసంతృప్తిని అర్థం చేసుకోవచ్చు. నెటిజన్లయితే రవిశాస్త్రిని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తుంటారు.
Samayam Telugu kohli shastri


వీటి గురించి కోచ్‌ దగ్గర ప్రస్తావించగా.. నా బాధ్యతలకు నేను న్యాయం చేసినంత వరకు నా ఉద్యోగం గురించి బాధపడనని చెప్పాడు. ‘నేను ప్రశాంతంగా నిద్రపోతున్నా. మేం క్రికెట్ ఆడే రోజుల్లో ఒకట్రెండు వార్తా పత్రికలే ఉండేవి. దీంతో వాటిని చదివేవాణ్ని. కానీ ఇప్పుడు అంత టైం ఉండటం లేదు. నేను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నా. ట్వీట్లు చేస్తాను, కానీ ఎవరేం కామెంట్ చేశారో చదవను. అదంతా నాకు అనవసరం. నా బాధ్యతలకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తున్నా. మిగతాదంతా అనవసరం’ అని చెప్పుకొచ్చాడు.

ఆసియా కప్‌లో కోహ్లి ఆడకుండా విశ్రాంతి తీసుకోవడానికి కారణమేంటో కూడా రవిశాస్త్రి చెప్పాడు. ఫిజికల్‌గా కోహ్లి ఎంతో ఫిట్‌గా ఉన్నాడు. కేవలం మానసిక అలసట కారణంగానే అతడికి విశ్రాంతినిచ్చాం. దీని వల్ల అతడు మళ్లీ తాజాగా బరిలో దిగుతాడ’ని శాస్త్రి తెలిపాడు. భువీ, బుమ్రా లాంటి ఆటగాళ్లకు కూడా ఇలాగే విశ్రాంతి కల్పిస్తామన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.