Top 3 Controversies That Shook Indian Cricket In 2019
2019లో టీమిండియాని కుదిపేసిన వివాదాలివే..!
భారత్ జట్టు 2019లో చిరస్మరణీయమైన విజయాల్ని అందుకుంది. వన్డే, టీ20లతో పాటు టెస్టుల్లోనూ వరుస సిరీస్ విజయాల్ని అందుకున్న టీమిండియా.. క్రికెట్ ప్రపంచంలోనే తిరుగులేని జట్టుగా ఎదిగింది. కానీ.. ఈ ఏడాది ఆరంభం నుంచి వివాదాలు కూడా భారత్ జట్టుని కుదిపేశాయి. ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోకి హాజరై.. అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాపై రెండు వారాలు నిషేధం వేటు పడగా.. ఆ తర్వాత వరల్డ్ కప్ జట్టు నుంచి అంబటి రాయుడ్ని పక్కన పెట్టడం.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య గొడవ భారత అభిమానుల్ని కలవరానికి గురిచేశాయి. అయితే.. సమష్టిగా రాణించిన టీమిండియా విజయాలతో అన్ని వివాదాలకి తెరదించగలిగింది.
Samayam Telugu26 Dec 2019, 2:03 pm
భారత్ జట్టు 2019లో చిరస్మరణీయమైన విజయాల్ని అందుకుంది. వన్డే, టీ20లతో పాటు టెస్టుల్లోనూ వరుస సిరీస్ విజయాల్ని అందుకున్న టీమిండియా.. క్రికెట్ ప్రపంచంలోనే తిరుగులేని జట్టుగా ఎదిగింది. కానీ.. ఈ ఏడాది ఆరంభం నుంచి వివాదాలు కూడా భారత్ జట్టుని కుదిపేశాయి. ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోకి హాజరై.. అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాపై రెండు వారాలు నిషేధం వేటు పడగా.. ఆ తర్వాత వరల్డ్ కప్ జట్టు నుంచి అంబటి రాయుడ్ని పక్కన పెట్టడం.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య గొడవ భారత అభిమానుల్ని కలవరానికి గురిచేశాయి. అయితే.. సమష్టిగా రాణించిన టీమిండియా విజయాలతో అన్ని వివాదాలకి తెరదించగలిగింది.
నోరు జారడంతో నిషేధం.. సారీతో సమసిన వివాదం
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోకి హాజరైన కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య అక్కడ అతను అడిగిన ప్రశ్నలకి కొంటెగా జవాబులిచ్చారు. పార్టీల్లో అమ్మాయిల్ని తను చూసే విధానంపై హార్దిక్ పాండ్య అసభ్యరీతిలో మాట్లాడగా.. తాను జేబులో కండోమ్స్ ఉంచుకునేవాడినంటూ కేఎల్ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో.. యువతకి ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఈ తరహాలో మాట్లాడటంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీరియస్ అయ్యింది. ఇద్దరి క్రికెటర్లపై క్రమశిక్షణ చర్యల కింద నిషేధం కూడా విధించింది. దీంతో.. అప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్కి ఎంపికైన క్రికెటర్లు.. మధ్యలోనే తిరిగి భారత్కి వచ్చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత హార్దిక్, రాహుల్ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో.. రెండు వారాల తర్వాత ఆ నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది. దీంతో.. క్రికెటర్లు టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వగలిగారు.
రాయుడిపై ఎందుకు అంత వివక్ష..?
ఐపీఎల్ 2018 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున పరుగుల వరద పారించిన అంబటి రాయుడు.. మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వగలిగాడు. 2019లో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో నెం.4లో ఆడిన రాయుడు.. భారత్ జట్టు 4-1తో సిరీస్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. దీంతో.. 2019 వన్డే ప్రపంచకప్లో అతడ్నే నెం.4లో ఆడిస్తారని అంతా ఊహించారు. కానీ.. వరల్డ్ కప్కి టీమ్ సెలక్షన్ సమయంలో రాయుడికి బదులుగా విజయ్ శంకర్ని నెం.4 స్థానం కోసం ఎంపిక చేశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రూపంలో అతను టీమ్కి మూడు కోణాల్లో ఉపయోగపడతాడని అప్పట్లో ఛీప్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పడంతో.. రాయుడు 3D ట్వీట్తో అతనిపై సెటైర్ వేశాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ గాయపడినా.. అతని స్థానంలో రిషబ్ పంత్కి అవకాశమిచ్చారు తప్ప.. రాయుడికి ఇవ్వలేదు. దీంతో.. నిరాశ చెందిన రాయుడు జులైలో రిటైర్మెంట్ ప్రకటించి.. మళ్లీ రెండు నెలల వ్యవధిలోనే ఆ రిటైర్మెంట్ని వెనక్కి తీసుకున్నాడు. మొత్తంగా.. రాయుడికి భారత సెలక్టర్లు మొండిచేయి చూపడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
రోహిత్ శర్మ ఒంటరిగా.. కోహ్లీ మొండిగా
వన్డే ప్రపంచకప్లో ఐదు శతకాలు బాదిన రోహిత్ శర్మ.. వరల్డ్కప్ రికార్డుల్ని తిరగరాశాడు. కానీ.. సెమీ ఫైనల్లో కెప్టెన్ కోహ్లీ ఏకపక్ష మొండి నిర్ణయాల కారణంగా టీమిండియా ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ముఖ్యంగా.. ధోనీని బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి పంపడమే.. భారత్ జట్టు ఓటమికి కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీతో డ్రెస్సింగ్ రూములోనే గొడవపడిన రోహిత్ శర్మ.. టీమిండియా కంటే ముందే ఇంగ్లాండ్ నుంచి ఒంటరిగా భారత్కి వచ్చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మలను ఇన్స్టాగ్రామ్లో రోహిత్ శర్మ అన్ఫాలో అయ్యాడు. దీంతో.. వివాదం వెలుగులోకి వచ్చింది.
వరల్డ్కప్లో మొదలైన గొడవ.. జట్టులో వేటు వరకూ
వన్డే ప్రపంచకప్ తర్వాత సూపర్ ఫామ్లో ఉన్న రోహిత్ శర్మకి వెస్టిండీస్ పర్యటనలో కొన్ని మ్యాచ్ల్లో కనీసం తుది జట్టులో కూడా విరాట్ కోహ్లీ అవకాశమివ్వలేదు. టెస్టు సిరీస్ మొత్తం.. రోహిత్ శర్మని రిజర్వ్ బెంచ్కే పరిమితం చేశారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కి అతడ్ని ఓపెనర్గా ఎంపిక చేయగా.. సెంచరీ, డబుల్ సెంచరీతో దుమ్ముదులిపేశాడు. మధ్య మధ్యలో రోహిత్ శర్మతో తనకి ఎలాంటి విభేదాలు లేవని కోహ్లీ చెప్పుకొచ్చినా.. అతను షేర్ చేసిన ఫొటోల్లో రోహిత్ శర్మకి స్థానం లభించలేదు. అయితే.. భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన సిరీస్తో ఈ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయాయి. కోహ్లీ, రోహిత్ మధ్య రెండు నెలలు విభేదాలు నడిచినా.. ఆ ప్రభావం కనీసం ఒక్క మ్యాచ్పై కూడా పడకపోవడం.. ఇద్దరు క్రికెటర్ల అంకితభావానికి నిదర్శనం.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.