యాప్నగరం

చెన్నై vs కోల్‌కతా: టాస్ ఆలస్యం ఎందుకంటే?

రెండేళ్ల తర్వాత చెన్నై జట్టు చెపాక్ స్టేడియంలో బరిలో దిగిన మ్యాచ్‌లో టాస్ నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా మొదలైంది. దీనికి కావేరీ నిరసన సెగలే కారణం.

Samayam Telugu 10 Apr 2018, 8:19 pm
రెండేళ్ల విరామం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెపాక్ స్టేడియంలో బరిలో దిగింది. ఆరంభ మ్యాచ్‌లో ముంబైపై థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్న ధోనీ సేన.. సొంత గడ్డ మీద కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతోంది. టాస్ గెలిచిన తలైవా ఎలాంటి సంకోచం లేకుండా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండేళ్ల తర్వాత చెన్నైలో జరుగుతోన్న మ్యాచ్ కావడంతో సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో మైదానానికి తరలివచ్చారు.
Samayam Telugu csk-vs-kkr


కానీ నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా టాస్ వేయడం చర్చనీయాంశమైంది. కావేరీ నదీ జలాల కోసం చెన్నైలో భారీ ఎత్తున నిరసన సెగలు జరుగుతుండటంతో దాని ప్రభావం మ్యాచ్‌పై పడింది. నిరసనకారులు అడ్డుకోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు స్టేడియానికి రావడం ఆలస్యమైంది. అందుకే టాస్ వేయడం లేటయ్యింది.

కావేరి నిరసన సెగలు తాకుతున్న వేళ.. చెపాక్‌ స్టేడియానికి 4 వేల మంది పోలీసులు భద్రత కల్పించారు. కానీ నిరసనకారులు మాత్రం ఆరంభంలోనే మ్యాచ్‌ను ప్రభావితం చేయగలిగారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.