రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడిపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్లో తనకి సెలక్టర్లు చోటివ్వకపోవడంతో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు.. గురువారం రాత్రి ఆ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు బీసీసీఐ, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్కి లేఖ రాశాడు. దీంతో.. 58 రోజుల్లోనే వీడ్కోలుపై ఈ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ తన మనసు మార్చుకోవడంతో అభిమానులు సెటైర్లు పేల్చుతున్నారు. కొందరైతే.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదితో పోలుస్తున్నారు. అఫ్రిది కూడా అంతర్జాతీయ క్రికెట్కి తొలుత రిటైర్మెంట్ ప్రకటించి.. ఆ తర్వాత వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. Read More: undefined
భారత్ జట్టులోకి 2013లో అరంగేట్రం చేసిన అంబటి రాయుడు.. గాడిన పడింది మాత్రం 2017లోనే అని చెప్పవచ్చు. ఆ ఏడాది ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున పరుగుల వరద పారించిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్మెన్.. భారత సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దీంతో.. అతడ్ని ఇంగ్లాండ్ పర్యటనకి ఎంపిక చేయగా.. యో-యో ఫిట్నెస్ టెస్టులో విఫలమైన కారణంగా ఆ అవకాశాన్ని రాయుడు చేజార్చుకున్నాడు. అయినప్పటికీ.. ఆ తర్వాత టెస్టులో పాసై టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి రాయుడు.. న్యూజిలాండ్పై అద్భుత ఇన్నింగ్స్తో వరల్డ్కప్ జట్టు రేసులోకి వచ్చాడు.
Read More: undefined
రెండేళ్లుగా భారత్ జట్టులో నెం.4 స్థానం రాయుడిదే అని అందరూ ధీమాగా చెప్తూ వచ్చారు. కానీ.. ఈ ఏడాది ఆరంభంలో ఫామ్ కోల్పోయిన రాయుడికి మొండిచేయి చూపుతూ వరల్డ్ కప్కి నెం.4 స్థానంలో విజయ్ శంకర్ని సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో.. పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగగా.. రాయుడ్ని స్టాండ్ బైగా సెలక్టర్ చేశారు. అయినప్పటికీ.. శిఖర్ ధావన్, విజయ్ శంకర్ గాయపడితే వరుసగా రిషబ్ పంత్, మయాంక్ అగర్వాల్ని వరల్డ్ కప్ కోసం ఎంచుకున్నారు తప్ప.. రాయుడికి అవకాశం ఇవ్వలేదు. దీంతో.. నిరాశ చెందిన రాయుడు క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకీ జూలై ఆరంభంలో రిటైర్మెంట్ ప్రకటించేశాడు.
భారత్ జట్టులోకి 2013లో అరంగేట్రం చేసిన అంబటి రాయుడు.. గాడిన పడింది మాత్రం 2017లోనే అని చెప్పవచ్చు. ఆ ఏడాది ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున పరుగుల వరద పారించిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్మెన్.. భారత సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దీంతో.. అతడ్ని ఇంగ్లాండ్ పర్యటనకి ఎంపిక చేయగా.. యో-యో ఫిట్నెస్ టెస్టులో విఫలమైన కారణంగా ఆ అవకాశాన్ని రాయుడు చేజార్చుకున్నాడు. అయినప్పటికీ.. ఆ తర్వాత టెస్టులో పాసై టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి రాయుడు.. న్యూజిలాండ్పై అద్భుత ఇన్నింగ్స్తో వరల్డ్కప్ జట్టు రేసులోకి వచ్చాడు.
Read More: undefined
రెండేళ్లుగా భారత్ జట్టులో నెం.4 స్థానం రాయుడిదే అని అందరూ ధీమాగా చెప్తూ వచ్చారు. కానీ.. ఈ ఏడాది ఆరంభంలో ఫామ్ కోల్పోయిన రాయుడికి మొండిచేయి చూపుతూ వరల్డ్ కప్కి నెం.4 స్థానంలో విజయ్ శంకర్ని సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో.. పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగగా.. రాయుడ్ని స్టాండ్ బైగా సెలక్టర్ చేశారు. అయినప్పటికీ.. శిఖర్ ధావన్, విజయ్ శంకర్ గాయపడితే వరుసగా రిషబ్ పంత్, మయాంక్ అగర్వాల్ని వరల్డ్ కప్ కోసం ఎంచుకున్నారు తప్ప.. రాయుడికి అవకాశం ఇవ్వలేదు. దీంతో.. నిరాశ చెందిన రాయుడు క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకీ జూలై ఆరంభంలో రిటైర్మెంట్ ప్రకటించేశాడు.