ట్విట్టర్లో సచిన్ ఫ్యాన్స్, ఆండ్రూ ఎలిజర్ అనే నెటిజన్ మధ్య వార్ కొనసాగుతోంది. సచిన్ చేసిన ట్వీట్ను ట్రోల్ చేశాడనే కారణంతో క్రికెట్ దేవుడి అభిమానులు.. అతడితో ఆటాడుకున్నారు. సచిన్ను ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేయడంతో.. అప్పటి వరకూ ఫ్రెండ్స్గా ఉన్న వాళ్లే.. నువ్వెంత, నీ ఫ్రెండ్షిప్ ఎంత..? సచిన్ను విమర్శించే దాకా వస్తే.. నీ స్నేహం అక్కర్లేదు పో అని కొందరు ట్వీట్ చేశారు. కానీ ట్రోల్ మాస్టర్గా పేరొందిన ఆండ్రూ (డెక్స్టర్ పాజీ) కి మద్దతు కొందరు ట్వీట్లు పెడుతున్నారు. #Isupportdexterpaaji హ్యాష్ ట్యాగ్తో ట్వీట్లు చేస్తూ అతడికి బాసటగా నిలుస్తున్నారు. అసలు ఈ వార్ ఎలా మొదలైందో చూద్దాం..
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్కు పాల్పడే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్రంగా స్పందించగా.. మాజీలు, క్రికెట్ ప్రేమికులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ వివాదం గురించి సచిన్ కూడా స్పందించాడు.
‘క్రికెట్ జెంటిల్మన్ గేమ్. ఎలాంటి వివాదాలకు, అక్రమాలకే తావు ఇవ్వకుండా ఆడాలి. బాల్ ట్యాంపరింగ్ వివాదం చోటు చేసుకోవడం దురదృష్టకరం. కానీ ఆట సమగ్రతను పెంపొందించే దిశగా సరైన నిర్ణయం తీసుకున్నారు. గెలవడం ముఖ్యమే కానీ గెలిచే విధానం అంత కంటే ముఖ్యం’ అని సచిన్ ట్వీట్ చేశాడు.
సచిన్ ట్వీట్కు ఆండ్రూ ఎలిజెర్ బదులిస్తూ.. మ్యాచ్ గెలవడం కంటే సెంచరీ చేయడం ముఖ్యం అని ట్వీట్ చేశాడు. సచిన్ను క్రికెట్ దేవుడిలా భావించే అభిమానులకు మనోడి రిప్లయ్తో చిర్రెత్తుకొచ్చింది. వరుసబెట్టి ట్వీట్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఈ గొడవెందిరా సామీ అనుకున్నాడేమో.. ఆ ట్వీట్ను తొలగించాడు. అయినా సచిన్ ఫ్యాన్స్ మాత్రం ఆగలేదు.
కొందరు మాత్రం ఆండ్రూ ఎలిజెర్కు బాసటగా నిలిచారు. మనం హేట్ చేసేవాళ్లని ట్రోల్ చేసినప్పుడు ఎంజాయ్ చేసి, మనకు ఇష్టమైన వాళ్లను ట్రోల్ చేసినప్పుడు జీర్ణించుకోలేకపోవడం అపరిపక్వత అంటూ.. ఆండ్రూకు అండగా నిలుస్తున్నారు. మరి మీరు ఎవరి వైపు..?
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్కు పాల్పడే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్రంగా స్పందించగా.. మాజీలు, క్రికెట్ ప్రేమికులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ వివాదం గురించి సచిన్ కూడా స్పందించాడు.
‘క్రికెట్ జెంటిల్మన్ గేమ్. ఎలాంటి వివాదాలకు, అక్రమాలకే తావు ఇవ్వకుండా ఆడాలి. బాల్ ట్యాంపరింగ్ వివాదం చోటు చేసుకోవడం దురదృష్టకరం. కానీ ఆట సమగ్రతను పెంపొందించే దిశగా సరైన నిర్ణయం తీసుకున్నారు. గెలవడం ముఖ్యమే కానీ గెలిచే విధానం అంత కంటే ముఖ్యం’ అని సచిన్ ట్వీట్ చేశాడు.
సచిన్ ట్వీట్కు ఆండ్రూ ఎలిజెర్ బదులిస్తూ.. మ్యాచ్ గెలవడం కంటే సెంచరీ చేయడం ముఖ్యం అని ట్వీట్ చేశాడు. సచిన్ను క్రికెట్ దేవుడిలా భావించే అభిమానులకు మనోడి రిప్లయ్తో చిర్రెత్తుకొచ్చింది. వరుసబెట్టి ట్వీట్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఈ గొడవెందిరా సామీ అనుకున్నాడేమో.. ఆ ట్వీట్ను తొలగించాడు. అయినా సచిన్ ఫ్యాన్స్ మాత్రం ఆగలేదు.
కొందరు మాత్రం ఆండ్రూ ఎలిజెర్కు బాసటగా నిలిచారు. మనం హేట్ చేసేవాళ్లని ట్రోల్ చేసినప్పుడు ఎంజాయ్ చేసి, మనకు ఇష్టమైన వాళ్లను ట్రోల్ చేసినప్పుడు జీర్ణించుకోలేకపోవడం అపరిపక్వత అంటూ.. ఆండ్రూకు అండగా నిలుస్తున్నారు. మరి మీరు ఎవరి వైపు..?