యాప్నగరం

గంగూలీ ఫ్యామీలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

ఇప్పటికే ఆ కుుటంబంలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో ఇద్దరికి కూడా కరోనా వైరస్ సోకడంతో ఆందోళన నెలకొంది. వారందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Samayam Telugu 20 Jun 2020, 8:26 am
భారత్‌లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. డాక్టర్లు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులకు సైతం కరోనా సోకింది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంట్లో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. తాజాగా మరో ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.
Samayam Telugu సౌరవ్ గంగూలీ
sourav ganguly


సౌరవ్‌ గంగూలీ అన్నయ్య, వారి కుటుంబ సభ్యులైన బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి స్నేహాశిష్‌ భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. అంతేకాదు వారి ఇంట్లో పనిచేసే వ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే స్నేహాశిష్‌ అత్తమామలు కూడా కోవిడ్ బారినపడ్డారు. కాగా, పశ్చిమ బెంగాల్‌ వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13,090 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 7,303 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 529 మంది మరణించారు. ప్రస్తుతం బెంగాల్‌లో 5,258 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.