యాప్నగరం

క్రికెట్ వినాశనానికి ఇదే పర్ఫెక్ట్..: ఐసీసీపై సచిన్ ఫైర్

క్రికెట్ వినాశానానికి ఇదే సంపూర్ణమైన పద్ధతంటూ ఐసీసీ అమలు చేస్తోన్న రెండు కొత్త బంతుల నిబంధనపై మండి పడ్డాడు.

Samayam Telugu 22 Jun 2018, 12:32 pm
వన్డే మ్యాచ్‌లో రెండు కొత్త బంతులను ఉపయోగించడాన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తప్పుబట్టాడు. వినాశనానికి ఇది పరిపూర్ణమైన పద్ధతి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. మితభాషి అయిన సచిన్ ఇటీవల ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ జట్టు భారీగా పరుగులు రాబట్టడంపై స్పందించాడు. ఇరు జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ ఏకంగా 481 పరుగులు బాది ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన సంగతి తెలిసిందే.
Samayam Telugu sachin tendulkar


‘వన్డే మ్యాచ్‌లో రెండు కొత్త బంతులు వాడటం అనేది వినాశనానికి అత్యుత్తమమైన విధానం. రివర్స్ స్వింగ్‌కు అనుకూలించేలా బంతి పాతబడటానికి టైం ఉండదు కాబట్టి డెత్ ఓవర్లో కొంత కాలంగా రివర్స్ స్వింగ్ చూడటం లేద’ని సచిన్ ట్వీట్ చేశాడు. సచిన్ మాటలతో పాకిస్థాన్ మాజీ ఆటగాడు వకార్ యూనిస్ ఏకీభవించాడు.

‘ఈ కారణంతోనే ఎక్కువ మంది అటాకింగ్ ఫాస్ట్ బౌలర్లను తయారు చేయలేకపోతున్నాం. రెండు కొత్త బంతులు వాడటం వల్ల బౌలర్లు ఆత్మరక్షణలో పడిపోతున్నారు. లైనప్ మారుస్తున్నారు. నీతో పూర్తిగా ఏకీభవిస్తున్నా సచిన్’ అంటూ వకార్ ట్వీట్ చేశాడు.

వన్డేల్లో రెండు కొత్త బంతులు ఉపయోగించేలా ఐసీసీ 2011 అక్టోబర్‌లో నిబంధనలను సవరించింది. దీని ప్రకారం తొలి ఓవర్‌ వేసేటప్పుడు ఒక అంపైర్ ఒక బంతిని వాడితే.. మరో ఓవర్‌కు రెండో అంపైర్ తన దగ్గరున్న బంతిని వాడతాడు. అంటే 50 ఓవర్ల ఆటలో ఒక బంతిని 25 ఓవర్ల చొప్పున వాడుతున్నారు. మ్యాచ్‌లను బ్యాట్స్‌మెన్ ఫ్రెండ్లీగా మార్చడం కోసం ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

గతంలో స్పిన్నర్లు మధ్య ఓవర్లలో బౌలింగ్ చేయడం వల్ల బంతి మెరుపు కోల్పోయి పాత బడేది. చివరి ఓవర్లలో పేసర్లు వచ్చి రివర్స్ స్వింగ్‌ రాబట్టి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టేవారు. కానీ ఇప్పుడు ఒకేసారి రెండు బంతులు వాడటం వల్ల ఆ అవకాశం లేకుండా పోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.