యాప్నగరం

ట్రోఫీని విరగొట్టిన ఓపెనర్ యశస్వి జైశ్వాల్

ఫైనల్ మ్యాచ్ తర్వాత భారత్, బంగ్లాదేశ్ యువ ఆటగాళ్లు మైదానంలోనే బాహాబాహీకి దిగగా.. ఆ తర్వాత ఓపెనర్ జైశ్వాల్ తన ట్రోఫీని రెండుగా విరగొట్టేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 13 Feb 2020, 7:44 pm
బంగ్లాదేశ్‌తో గత ఆదివారం జరిగిన అండర్-19 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్ ఓటమితో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సహనం కోల్పోయాడు. టోర్నీలో టాప్ స్కోరర్‌గా జైశ్వాల్ నిలవగా.. అతనికి ‘మ్యాన్ ఆఫ్ ద టోర్నీమెంట్’ అవార్డు లభించింది. కానీ.. ఓటమి బాధలోనే దాన్ని తీసుకున్న జైశ్వాల్.. అనంతరం రెండుగా విరగొట్టినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu Potchefstroom: In this photo sourced from ICC, Yashasvi Jaiswal of India bats du...


Read More: undefined

టోర్నీలో ఆరు మ్యాచ్‌లాడిన జైశ్వాల్ ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో ఏకంగా 400 పరుగులు నమోదు చేశాడు. అతని స్కోర్లు ఓసారి పరిశీలిస్తే..? 88, 105 నాటౌట్, 62, 57 నాటౌట్, 29 నాటౌట్, 59‌ పరుగులు. కానీ.. అంత కష్టపడినా ఫైనల్లో పేలవ బ్యాటింగ్, బౌలింగ్ కారణంగా బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిపోవడంతో జైశ్వాల్ చాలా నిరాశకి గురయ్యాడు. ఈ క్రమంలోనే తనకి లభించిన ట్రోఫీని కూడా అతను పగలగొట్టినట్లు తెలుస్తోంది.

Read Also: పానీ పూరి అమ్మే స్థాయి నుంచి.. ప్ర‌పంచ‌క‌ప్ ఫైనల్ దాకా.. క్రికెట‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ సక్సెస్ స్టోరీ
ట్రోఫీని విరగొట్టడంపై జైశ్వాల్ కోచ్ జ్వాలా సింగ్ మాట్లాడుతూ ‘ఇదేం మొదటిసారి కాదు.. అయినా.. జైశ్వాల్ పరుగులపై శ్రద్ధ పెడతాడు తప్ప.. ఇలాంటి ట్రోఫీలపై కాదు’ అని వెనకేసుకొచ్చాడు. ఎడమచేతి ఓపెనర్ కావడంతో శిఖర్ ధావన్ స్థానంలో జట్టులోకి జైశ్వాల్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.