యాప్నగరం

తలకు గాయంతో మైదానం వీడిన అంపైర్

భారత్, ఇంగ్లండ్ మధ్య ముంబైలో జరుగుతున్న నాలుగో టెస్టులో అంపైర్ పాల్ రిఫెల్ గాయపడ్డాడు.భువీ విసిరిన బంతి పాల్‌ తలకు బలంగా తాకింది.

TNN 8 Dec 2016, 1:45 pm
భారత్, ఇంగ్లండ్ మధ్య ముంబైలో జరుగుతున్న నాలుగో టెస్టులో అంపైర్ పాల్ రిఫెల్ గాయపడ్డాడు. దీంతో అతడి స్థానంలో ఎరాస్మస్ అంపైర్‌గా వ్యవహరించాల్సి వచ్చింది. లంచ్ విరామం తర్వాత భారత స్పిన్నర్లు పట్టు బిగించారు. 90 పరుగులు దాటిన అరంగేట్రం ఆటగాడు జెన్నింగ్స్‌పై ఒత్తిడి పెంచేలా అశ్విన్ బౌలింగ్ వేస్తున్నాడు. ఈ క్రమంలో ఇబ్బంది పడుతూనే జెన్నింగ్ అశ్విన్ బంతిని ఆడాడు. డీప్‌లో ఉన్న భారత ఆటగాడు భువనేశ్వర్ కుమార్ బంతిని వికెట్ల వైపు విసరడంతో అది నేరుగా వచ్చి అంపైర్ పాల్ ‌తలను తాకింది. బంతి వెనుకవైపు నుంచి రావడంతో ఆయన కూడా చూసుకోలేదు. బంతి తలకు తగలగానే అంపైర్ కింద పడిపోయాడు.
Samayam Telugu umpire paul reiffel hit by ball and left the ground
తలకు గాయంతో మైదానం వీడిన అంపైర్


వెంటనే స్పందించిన ఇంగ్లండ్ జట్టు ఫిజియోథెరపిస్ట్ పరుపరుగున మైదానంలోకి చేరుకున్నాడు. రక్తం కారుతుండటంతో వెంటనే అతణ్ని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాడు. దీంతో ముందుగానే డ్రింక్స్ బ్రేక్ ఇచ్చి కాసేపు ఆటను ఆపేయాల్సి వచ్చింది. థర్డ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఎరాస్మస్ పాల్ రిఫెల్ స్థానంలో అంపైరింగ్ బాధ్యతలు చేపట్టాడు. పాపం పాల్.. టైమ్ బాగోలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.