యాప్నగరం

ఉమేశ్‌కి ఆ ఛాన్స్‌ దక్కలేదు: బౌలింగ్ కోచ్

మహ్మద్ సిరాజ్ చాలా వేగంగా నేర్చుకుంటున్నాడు. అతను ఇటీవల భారత్-ఎ జట్టు తరఫున చేసిన మెరుగైన ప్రదర్శనే దానికి నిదర్శనం

Samayam Telugu 10 Oct 2018, 5:45 pm
విదేశీ గడ్డపై ఎక్కువ టెస్టులు ఆడే అవకాశం భారత్ ఫాస్ట్ బౌలర్‌ ఉమేశ్ యాదవ్‌కి దక్కలేదని టీమిండియా బౌలింగ్‌ కోచ్ భరత్ అరుణ్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో రాజ్‌కోట్ వేదికగా గత శనివారం ముగిసిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం 14 ఓవర్లు బౌలింగ్ చేసిన ఉమేశ్ యాదవ్ 36 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ వేదికగా శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్‌కి బదులుగా యువ ఫాస్ట్ బౌలర్‌ మహ్మద్ సిరాజ్‌ని జట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Samayam Telugu ..
India's Umesh Yadav celebrates the dismissal of England's Adil Rashid during the third day of the first test cricket match between England and India at Edgbaston in Birmingham, England. AP/PTI


జట్టు ఎంపికపై తాజాగా భరత్ అరుణ్ మాట్లాడుతూ ‘దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ గడ్డపై దురదృష్టవశాత్తు ఉమేశ్ యాదవ్‌కి ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించలేదు. దీనికి ప్రధాన కారణం.. జట్టులో ఉన్న ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ మెరుగ్గా రాణించడమే. అయితే.. ఈ ఇద్దరికీ టీమిండియా మేనేజ్‌మెంట్ రెస్ట్ ఇస్తే.. మొదట వినిపించే పేరు మాత్రం ఉమేశ్ యాదవ్‌దే. ఈ రొటేషన్ పాలసీని అతను కూడా అర్థం చేసుకున్నాడు. మరోవైపు మహ్మద్ సిరాజ్ చాలా వేగంగా నేర్చుకుంటున్నాడు. అతను ఇటీవల భారత్-ఎ జట్టు తరఫున చేసిన మెరుగైన ప్రదర్శనే దానికి నిదర్శనం’ అని భరత్ అరుణ్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.