యాప్నగరం

పాక్‌తో ఫైనల్‌లో కోహ్లీ, యువీ మ్యాచ్ ఫిక్స్ంగ్?

ఛాంపియన్స్ ట్రోఫీ తుది పోరులో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ఆరోపించారు.

TNN 2 Jul 2017, 11:58 am
ఛాంపియన్స్ ట్రోఫీ తుది పోరులో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ఆరోపించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్‌తోపాటు ఇతర క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడటం వల్లే ఓడిపోయారని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి వ్యాఖ్యానించారు. మ్యాచ్‌లో భారత్ ఓటమి తీరు చూస్తే ఈ అనుమానం కలుగుతుందని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఫైనల్‌లో మ్యాచ్‌లో పాకిస్థాన్ 180 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ట్రోఫీ అసాంతం అద్భుతంగా ఆడి జట్టును ఫైనల్‌కు చేర్చిన ఆటగాళ్లు తుది పోరులో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు.
Samayam Telugu union minister match fixing comments against kohli and yuvraj
పాక్‌తో ఫైనల్‌లో కోహ్లీ, యువీ మ్యాచ్ ఫిక్స్ంగ్?


కెప్టెన్ కోహ్లీ తరచూ సెంచరీలతో కదతొక్కుతాడు, యువరాజ్ గతంలో ఎన్నో కీలక ఇన్నింగ్సులు ఆడాడు.... కానీ పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో వీళ్లిద్దరూ ఓడిపోవడానికే ఆడినట్లు అనిపించిందని ఆయన విమర్శించారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్‌దాస్ పై విధంగా వ్యాఖ్యానించారు. లీగ్ దశలో భారత్ చేతిలోనే ఓడిపోయిన పాకిస్థాన్ అనూహ్యంగా పుంజుకుని ట్రోఫీని గెలుచుకుందని ఆయన అన్నారు. దీంతో ఆ జట్టు 2009 టీ-20 వరల్డ్ కప్ తర్వాత తొలిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. అంతే కాదు పెద్ద టోర్నీల్లో భారత్ చేతిలో ఓడిపోయే బలహీనత నుంచి బయటపడిందని పేర్కొన్నారు.

కోచ్ అనిల్ కుంబ్లే కూడా అక్కడే ఉన్నాడు... గతంలో ఎన్నో పరుగులు సాధించిన కోహ్లీకి ఆ రోజు ఏమైందని, అందుకే ఫిక్సింగ్ జరిగిందనే అనుమానం కలుగుతోందని రామ్‌దాస్ అథవాలే దుయ్యబట్టారు. దాయాది ముందు తలవంచడం దేశాన్ని అవమానించడమేనని ఆయన అన్నారు. లండన్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశ నుంచి సామర్థ్యానికి తగినట్లు ఆడి ఫైనల్ చేరుకున్న పాక్ చేతిలో పరాజయం మూటగట్టుకుంది. అసలు టాస్ గెలిచిన కెప్టెన్ కోహ్లీ పాక్‌కు బ్యాటింగ్ అప్పగించడమేంటని క్రీడాభిమానులు సైతం విస్తుపోయారు. కోహ్లీ నిర్ణయంపై అనేక విమర్శలు కూడా చెలరేగాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.