యాప్నగరం

అభిమానులూ.. కాస్త ఓపిక పట్టండి..!

శ్రీలంక దాదాపు 18 ఏళ్లపాటు ప్రపంచవ్యాప్తంగా మూడు ఫార్మాట్లలోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కానీ.. ఇప్పుడు

TNN 16 Aug 2017, 1:29 pm
భారత్‌ చేతిలో క్లీన్‌స్వీప్‌కి గురైన శ్రీలంక జట్టుపై వస్తున్న విమర్శలపర్వం ఇంకా కొనసాగుతోంది. ఇటీవల ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన శ్రీలంక.. టీమిండియాకి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దీంతో కలత చెందిన స్థానిక అభిమానులు శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఊహించని ఈ పరిణామాలపై శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్ ఉపుల్ తరంగ స్పందిస్తూ.. అభిమానులు కొంచెం ఓపిక పట్టాలని సూచించాడు.
Samayam Telugu upul tharanga pleads for patience from fans
అభిమానులూ.. కాస్త ఓపిక పట్టండి..!


‘ప్రతి క్రికెట్ జట్టుకి కష్టకాలం వస్తుంటుంది. దానికి దేశం, జట్టు గొప్పతనంతో సంబంధం లేదు. శ్రీలంక దాదాపు 18 ఏళ్లపాటు ప్రపంచవ్యాప్తంగా మూడు ఫార్మాట్లలోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కానీ.. ఇప్పుడు సంధిదశలో ఉంది. ఈ ఓటములకి కారణాలను ప్రస్తుతం బహిరంగంగా చర్చించలేం. నిజమే.. క్రికెటర్లు మ్యాచ్‌లో కొన్ని తప్పిదాలు చేశారు. వాటిని సరిదిద్దుకుంటాం. తప్పకుండా శ్రీలంక మళ్లీ గెలుపు బాట పడుతుంది. కానీ.. దానికి కొంత సమయం పడుతుంది. దయచేసి అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి’ అని తరంగ అభిమానులని అభ్యర్థించారు. ఆగస్టు 20 నుంచి భారత్‌తో ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌లో తలపడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.