యాప్నగరం

ఇది క్రికెట్ సాధించిన విజయం: జస్టిస్ లోధా

బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ శిర్కేలను పదవుల నుంచి సుప్రీం కోర్టు తొలగించడంపై జస్టిస్ ఆర్.ఎం. లోధా స్పందించారు.

TNN 2 Jan 2017, 12:21 pm
బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ శిర్కేలను పదవుల నుంచి సుప్రీం కోర్టు తొలగించడంపై జస్టిస్ ఆర్.ఎం. లోధా స్పందించారు. ఇది క్రికెట్ సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలోని క్రీడా సంఘాలకు ఒక సూచనలా పనిచేస్తుందన్నారు. క్రీడా పాలకులకు ఇదొక గట్టిదెబ్బని, కానీ క్రీడాభివృద్ధికి ఈ తీర్పు ఎంతగానో తోడ్పడుతుందని ఆయన చెప్పారు.
Samayam Telugu victory for cricket says justice lodha on thakur and shirke removal
ఇది క్రికెట్ సాధించిన విజయం: జస్టిస్ లోధా


మరోవైపు బీసీసీఐపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ స్వాగతించారు. భారత క్రీడా రంగానికి, ముఖ్యంగా క్రికెట్‌కు ఇది శుభవార్త అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం బీసీసీఐ బాధ్యతలను ఇద్దరు సీనియర్ వైస్ ప్రెసిడెంట్లలకు అప్పగించిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. బీసీసీఐ పరిశీలకుడి విషయంలో ఆ రోజున తీర్పు వెల్లడిస్తామని ధర్మాసనం వెల్లడించింది.
#WATCH: Victory for cricket, administrators come & go but ultimately its for the game's benefit says Justice Lodha on Thakur/Shirke removal pic.twitter.com/mmic3v09zx — ANI (@ANI_news) January 2, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.