యాప్నగరం

ముంబయి జట్టులోకి పృథ్వీ షా, రహానె..!

ఇప్పటికే ముంబయి జట్టు తరఫున ఓపెనర్ రోహిత్ శర్మ ఆదివారం ఒక మ్యాచ్ ఆడగా.. తాజాగా అజింక్య రహానె, పృథ్వీ షాని కూడా టీమ్‌లోకి సెలక్టర్లు ఎంపిక చేశారు.

Samayam Telugu 15 Oct 2018, 5:07 pm
దేశవాళీ టోర్నీ.. విజయ్ హజారే ట్రోఫీ చివరి అంకానికి చేరుకుంటుండటంతో ముంబయి జట్టు సెలక్టర్లు తమ టీమ్‌లోకి అగ్రశ్రేణి ఆటగాళ్లని చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ముంబయి జట్టు తరఫున ఓపెనర్ రోహిత్ శర్మ ఆదివారం ఒక మ్యాచ్ ఆడగా.. తాజాగా అజింక్య రహానె, పృథ్వీ షాని కూడా టీమ్‌లోకి సెలక్టర్లు ఎంపిక చేశారు. బుధవారం బెంగళూరు వేదికగా ముంబయి జట్టు సెమీ ఫైనల్ ఆడనుంది.
Samayam Telugu 600


వెస్టిండీస్‌తో ఆదివారం ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో పృథ్వీ షా ఒక శతకం, అర్ధశతకంతో టాప్‌ స్కోరర్‌గా నిలిచి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌’గా ఎంపికవగా.. అజింక్య రహానె కూడా అర్ధశతకంతో మెరిసిన విషయం తెలిసిందే.

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా.. నిన్న బెంగళూరులో జరిగిన తొలి క్వార్టర్‌ ఫైనల్ మ్యాచ్‌లో బిహార్‌తో తలపడిన ముంబయి జట్టు 9 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 43 బంతుల్లో 3x4, 2x6 సాయంతో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

భారత్ జట్టు ఈనెల 21 నుంచి వెస్టిండీస్‌తో ఐదు వన్డేల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.