యాప్నగరం

శ్రీలంకతో టెస్టు సిరీస్‌‌కు భారత జట్టు ప్రకటన!

సొంత గడ్డపై శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు భారత క్రికెట్ జట్టును ప్రకటించారు.

TNN 23 Oct 2017, 12:17 pm
సొంత గడ్డపై శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. రహానేను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసిన సెలక్టర్లు.. మణికట్టు గాయం కారణంగా లంక గడ్డ మీద టెస్టు సిరీస్‌కు దూరమైన ఓపెనర్ మురళీ విజయ్‌కు తిరిగి అవకాశం కల్పించారు. పేసర్ ఇశాంత్ శర్మను కూడా ఎంపిక చేసినట్లు బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ కాంత్ తెలిపారు. తొలి రెండు టెస్టుల కోసం 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును సోమవారం ఆయన ప్రకటించారు. శ్రీలంక జట్టు భారత గడ్డ మీద మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. శ్రీలంక ఆసీస్, న్యూజిలాండ్‌లతో పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో అశ్విన్, జడేజాలను ఎంపిక చేయని సెలక్టర్లు లంకతో జరగబోయే టెస్టు సిరీస్‌లో మాత్రం వారికి తిరిగి అవకాశం కల్పించారు.
Samayam Telugu vijay ishant included in india for first two tests against sl
శ్రీలంకతో టెస్టు సిరీస్‌‌కు భారత జట్టు ప్రకటన!


లంకతో తలపడే జట్టు: విరాట్ కోహ్లి, అజింక్య రహానే, మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా, రోహిత్, శర్మ, సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హార్దిక పాండ్య, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్‌‌, ఇషాంత్ శర్మ.

నవంబర్ 16న ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. నవంబర్ 24, డిసెంబర్ 2 తేదీల్లో రెండో, మూడో టెస్టులు ప్రారంభం అవుతాయి. డిసెంబర్ 10న మొదటి వన్డే జరగనుండగా.. డిసెంబర్ 17న మూడో వన్డేకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 24న వాంఖడేలో చివరి టీ20 మ్యాచ్ జరగుతుంది.

న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు టీ20లకు కూడా సెలెక్టర్లు జట్టును ఎంపిక చేశారు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలు ఉన్న నేపథ్యంలో రోటేషన్ విధానాన్ని అవలంభిస్తామని కోహ్లి చెప్పాడు. ఢిల్లీలో జరగనున్న టీ20 మ్యాచ్‌తో నెహ్రా క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్న నేపథ్యంలో అతడికి జట్టులో చోటు కల్పించారు. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు కూడా అవకాశం కల్పించారు.

న్యూజిలాండ్‌తో తలపడే టీ20 జట్టు: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, ధోనీ, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, నెహ్రా, సిరాజ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.