యాప్నగరం

ధోనీ, కోహ్లి సలహా‌తో కోటీశ్వరులయ్యారు..!

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, కెప్టెన్ విరాట్ కోహ్లి సలహాతో టీమిండియాకి ఆడకుండానే కొంతమంది యువ

TNN 6 Dec 2017, 3:18 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, కెప్టెన్ విరాట్ కోహ్లి సలహాతో టీమిండియాకి ఆడకుండానే కొంతమంది యువ క్రికెటర్లు కోటీశ్వరులయ్యారు. రంజీ, రాష్ట్రస్థాయి టోర్నీల్లో సత్తాచాటుతున్న క్రికెటర్లని ఐపీఎల్ ద్వారా వెలుగులోకి తీసుకురావాలని బీసీసీఐకి ఈ ఇద్దరు ఆటగాళ్లు సూచించారట. ఇందులో భాగంగానే ఈ ఏడాది హైదరాబాద్‌కి చెందిన మహ్మద్ షిరాజ్ (రూ. 2.6 కోట్లు), టి. నటరాజన్ (రూ.3 కోట్లు) ఐపీఎల్ వేలంలో పెద్ద మొత్తానికి అమ్ముడుపోయినట్లు ఓ మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది.
Samayam Telugu virat and ms dhoni recommend salary cap for uncapped players in ipl reports
ధోనీ, కోహ్లి సలహా‌తో కోటీశ్వరులయ్యారు..!


బంతితో అద్భుతంగా రాణిస్తున్న కరియప్పని ఐపీఎల్‌ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ 2015లో రూ.2.4కోట్లకి కొనుగోలు చేసింది. అతను కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో కూడా కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. కానీ.. కర్ణాటక రంజీ జట్టు తరఫున మాత్రం కరియప్ప ఒక మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు. ఇలా పక్కన పెట్టడంతో ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకి తప్పుడు సందేశాలు వెళ్తాయని.. వాటిని నివారించాలంటే బీసీసీఐ యువ క్రికెటర్లకి తగిన అవకాశాలు కల్పించాలని ధోని, కోహ్లి బీసీసీఐకి సూచించారట. కేవలం రంజీలు మాత్రమే ఆడుతున్న క్రికెటర్లకి రూ. 10-12 లక్షలు మాత్రమే అందుతున్నాయని.. వారి వేతనం పెంపుపై కూడా ఈ క్రికెటర్లు బీసీసీఐ పెద్దలతో చర్చించారట. టీమిండియాకి ఆడే అవకాశం దక్కకపోయినా.. ప్రతిభ ఉన్న క్రికెటర్లని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ ఇద్దరు క్రికెటర్లు పైవిధంగా బోర్డుకి సూచనలు చేసినట్లు తెలిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.