భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో తెంబ బవుమా, విరాట్ కోహ్లీ మధ్య మరోసారి మాటల యుద్ధం నడిచింది. కేప్టౌన్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబ బవుమాని కళ్లు చెదిరే త్రో విసిరి భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ రనౌట్ చేశాడు. అయితే.. బంతి వికెట్లని తాకే సమయానికి బవుమా క్రీజు సమీపానికి వచ్చి ఉండటంతో.. ఫీల్డ్ అంపైర్ తుది నిర్ణయం కోసం థర్డ్ అంపైర్కి నివేదించాడు. దాంతో.. థర్డ్ అంపైర్ రిప్లైని పరిశీలిస్తున్న సమయంలో.. కోహ్లీ, బవుమా మాధ్య మాటల యుద్ధం నడిచింది. ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన దీపక్ చాహర్ బౌలింగ్లో తెంబ బవుమా (8: 12 బంతుల్లో 1x4) బంతిని మిడాఫ్ దిశగా ఫుష్ చేసి సింగిల్ కోసం నాన్స్ట్రైక్ ఎండ్లోని డికాక్ (124: 130 బంతుల్లో 12x4, 2x6)ని పిలిచాడు. వాస్తవానికి ఫస్ట్ రెండు వన్డేల్లో బవుమా ఇలానే బంతిని మిడాన్, మిడాఫ్ దిశగా ఫుష్ చేసి చాలా సింగిల్స్ తీశాడు. దాంతో.. కేఎల్ రాహుల్.. బవుమా క్రీజులో ఉన్నంతసేపు అక్కడ కోహ్లీ లేదా తానే ఫీల్డింగ్ చేస్తూ కనిపించారు. తొలి వన్డేలో కాసేపు అశ్విన్ని మిడాన్లో ఫీల్డింగ్కి ఉంచగా.. అశ్విన్ రియాక్ట్ అయ్యేలోపే బవుమా చకచకగా సింగిల్స్ తీసేస్తూ కనిపించాడు. దాంతో.. వెంటనే అశ్విన్ని అక్కడి నుంచి తప్పించి.. కోహ్లీని రాహుల్ ఫీల్డింగ్కి ఉంచాడు.
ఆదివారం మూడో వన్డేలోనూ బవుమా అదే సింగిల్ ప్లాన్తో వచ్చినట్లు కనిపించింది. కానీ.. కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఈసారి తానే మిడాఫ్లో ఫీల్డింగ్ చేసి బవుమా సింగిల్ ప్లాన్ని రనౌట్తో తిప్పికొట్టాడు. వేగంగా పరుగెత్తుకుంటూ బంతి వద్దకి వెళ్లిన రాహుల్.. గురిచూసి వికెట్లపైకి బంతిని నేరుగా విసిరాడు. బంతి వికెట్లని తాకే సమయానికి క్రీజు లైన్కి చేరువలో బవుమా బ్యాట్ కనిపించింది. థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించగానే.. బవుమా పెవిలియన్కి వెళ్తుండగా.. వెనుక నుంచి విరాట్ కోహ్లీ ‘‘ఫీల్డింగ్లో మమ్మల్ని లైట్గా తీసుకుంటావా?’’ అంటూ గట్టిగా అరవడం కనిపించింది. దాంతో.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసిన బవుమా.. అలానే మౌనంగా పెవిలియన్కి వెళ్లిపోయాడు. తొలి వన్డేలో విరాట్ కోహ్లీ తనకి బాడీకి క్లోజ్గా రనౌట్ కోసం బంతిని విసరడంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఆదివారం మూడో వన్డేలోనూ బవుమా అదే సింగిల్ ప్లాన్తో వచ్చినట్లు కనిపించింది. కానీ.. కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఈసారి తానే మిడాఫ్లో ఫీల్డింగ్ చేసి బవుమా సింగిల్ ప్లాన్ని రనౌట్తో తిప్పికొట్టాడు. వేగంగా పరుగెత్తుకుంటూ బంతి వద్దకి వెళ్లిన రాహుల్.. గురిచూసి వికెట్లపైకి బంతిని నేరుగా విసిరాడు. బంతి వికెట్లని తాకే సమయానికి క్రీజు లైన్కి చేరువలో బవుమా బ్యాట్ కనిపించింది. థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించగానే.. బవుమా పెవిలియన్కి వెళ్తుండగా.. వెనుక నుంచి విరాట్ కోహ్లీ ‘‘ఫీల్డింగ్లో మమ్మల్ని లైట్గా తీసుకుంటావా?’’ అంటూ గట్టిగా అరవడం కనిపించింది. దాంతో.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసిన బవుమా.. అలానే మౌనంగా పెవిలియన్కి వెళ్లిపోయాడు. తొలి వన్డేలో విరాట్ కోహ్లీ తనకి బాడీకి క్లోజ్గా రనౌట్ కోసం బంతిని విసరడంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.