టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రయ్యాడు. అతని భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ సోమవారం పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. దాంతో.. భారత క్రికెటర్లతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు విరుష్క జోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వాస్తవానికి విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ దంపతులకి ఆడబిడ్డ పుట్టబోతోందని గత ఏడాది సెప్టెంబరులోనే బెంగళూరుకి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు పండిత్ జగన్నాథ్ అంచనా వేశారు. తాజాగా అతని అంచనానే నిజమైంది.
అనుష్క శర్మ గర్భవతి అని తెలియగానే విరాట్ కోహ్లీ అభిమానులు ‘బుల్లి కోహ్లీ’ పుడతాడంటూ అంచనాలు వేయగా.. అనుష్క శర్మ ఫ్యాన్స్ ‘జూనియర్ అనుష్క’ రాబోతోందని అంచనాలు వేశారు. గత ఏడాది ఇదో హాట్ టాఫిక్గా మారిపోయింది. దాంతో.. రంగంలోకి దిగిన పండిత్ జగన్నాథ్ ‘‘ఆడ బిడ్డ లేదా మగ బిడ్డ ఎవరైనా దేవుడి బహుమతే. ఇద్దరూ సమానమే. ఇటీవల కాలంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే వివిధ రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఫేస్ రీడింగ్, జ్యోతిష్య శాస్త్రం లెక్కల ప్రకారం చూస్తుంటే..? విరుష్క జోడీకి పుట్టబోయేది ఆడబిడ్డ’’ అని అప్పట్లో జోస్యం చెప్పాడు. తాజాగా అతని అంచనానే నిజమైంది.
భారత క్రికెటర్లలో ఇప్పటికే చాలా మందికి మొదట ఆడపిల్లలు జన్మించారు. మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, సురేశ్ రైనా, అంబటి రాయుడు, అజింక్య రహానె, హర్భజన్ సింగ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, ఎస్. శ్రీశాంత్, గౌతమ్ గంభీర్ తదితరులు ఆడబిడ్డకి తండ్రులైన విషయం తెలిసిందే. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? ధోనీ, రోహిత్ శర్మ వారి భార్యలు ప్రసవించిన సమయంలో ఆస్ట్రేలియా టూర్లో ఉండగా.. విరాట్ కోహ్లీ కూడా ఆస్ట్రేలియా టూర్ నుంచి ఇటీవల భారత్కి వచ్చాడు.
అనుష్క శర్మ గర్భవతి అని తెలియగానే విరాట్ కోహ్లీ అభిమానులు ‘బుల్లి కోహ్లీ’ పుడతాడంటూ అంచనాలు వేయగా.. అనుష్క శర్మ ఫ్యాన్స్ ‘జూనియర్ అనుష్క’ రాబోతోందని అంచనాలు వేశారు. గత ఏడాది ఇదో హాట్ టాఫిక్గా మారిపోయింది. దాంతో.. రంగంలోకి దిగిన పండిత్ జగన్నాథ్ ‘‘ఆడ బిడ్డ లేదా మగ బిడ్డ ఎవరైనా దేవుడి బహుమతే. ఇద్దరూ సమానమే. ఇటీవల కాలంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే వివిధ రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఫేస్ రీడింగ్, జ్యోతిష్య శాస్త్రం లెక్కల ప్రకారం చూస్తుంటే..? విరుష్క జోడీకి పుట్టబోయేది ఆడబిడ్డ’’ అని అప్పట్లో జోస్యం చెప్పాడు. తాజాగా అతని అంచనానే నిజమైంది.
భారత క్రికెటర్లలో ఇప్పటికే చాలా మందికి మొదట ఆడపిల్లలు జన్మించారు. మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, సురేశ్ రైనా, అంబటి రాయుడు, అజింక్య రహానె, హర్భజన్ సింగ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, ఎస్. శ్రీశాంత్, గౌతమ్ గంభీర్ తదితరులు ఆడబిడ్డకి తండ్రులైన విషయం తెలిసిందే. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? ధోనీ, రోహిత్ శర్మ వారి భార్యలు ప్రసవించిన సమయంలో ఆస్ట్రేలియా టూర్లో ఉండగా.. విరాట్ కోహ్లీ కూడా ఆస్ట్రేలియా టూర్ నుంచి ఇటీవల భారత్కి వచ్చాడు.