యాప్నగరం

రివ్యూపై కోహ్లీకి ఆ తొందరేలా..?: అగార్కర్

ఒక్కసారి డీఆర్‌ఎస్ ఛాన్స్‌లు కోల్పోతే.. మళ్లీ 80 ఓవర్ల వరకూ ఎదురుచూడాలనే విషయాన్ని విరాట్ కోహ్లీ గుర్తుంచుకోవాలి

Samayam Telugu 8 Sep 2018, 7:43 pm
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అనాలోచితంగా రివ్యూలు అడిగేస్తున్నాడని మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ విమర్శించాడు. ఇంగ్లాండ్‌తో ఓవల్ వేదికగా శుక్రవారం ఆరంభమైన ఐదో టెస్టులో జట్టుకి లభించిన రెండు రివ్యూలను విరాట్ కోహ్లీ వృథా చేయడాన్ని గవాస్కర్ తప్పుబట్టాడు. అలిస్టర్ కుక్, మొయిన్ అలీ‌ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. డీఆర్‌ఎస్‌(రివ్యూ)కి వెళ్లిన కోహ్లీకి చుక్కెదురైంది. దీంతో.. రెండు డీఆర్‌ఎస్ ఛాన్స్‌లు కోల్పోయిన టీమిండియా శనివారం కూడా తొలి రెండు సెషన్లలోనూ రివ్యూకి వెళ్లే అవకాశం లేకపోయింది. టెస్టుల్లో 80 ఓవర్లకి ఒకసారి రెండు జట్లకీ రెండేసి డీఆర్‌ఎస్ అవకాశాలు లభిస్తాయి.
Samayam Telugu KohliAppeal2-getty


‘ఓవల్ టెస్టులో ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేసిన ప్రతిసారీ కోహ్లీ రివ్యూకి వెళ్లేందుకు ఆసక్తి చూపాడు. కానీ.. అతను రివ్యూ అడిగే ముందు పునరాలోచించుకుంటే మంచింది. రివ్యూలో అంపైర్స్ కాల్‌ వస్తే ఫర్వాలేదు.. మళ్లీ ఆ రివ్యూ ఛాన్స్ జట్టుకి లభిస్తుంది. అలాకాకుండా.. రివర్స్‌లో వస్తే.. జట్టు ఒక రివ్యూ అవకాశం కోల్పోతుంది కదా..? కాబట్టి జట్టు కెప్టెన్‌గా కోహ్లీ కొంచెం తెలివిగా మైదానంలో వ్యవహరించాలి. ఒక్కసారి డీఆర్‌ఎస్ ఛాన్స్‌లు కోల్పోతే.. మళ్లీ 80 ఓవర్ల వరకూ ఎదురుచూడాలనే విషయాన్ని అతను గుర్తుంచుకోవాలి’ అని అగార్కర్ సూచించాడు. ఆటలో రెండో రోజైన శనివారం ఓవర్‌నైట్ స్కోరు 198/7తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు 332 పరుగులకి ఆలౌటైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.