యాప్నగరం

క్యాచ్‌లు జారవిడిచే వారికి.. గెలిచే అర్హత లేదు

భారత్ ఇంకా 25-30 పరుగులు అదనంగా చేసుంటే బాగుండేది. మ్యాచ్ ఆరంభంలోనే జట్టు స్కోరు 230కి

TNN 10 Jul 2017, 12:54 pm
మైదానంలో క్యాచ్‌లు జారవిడిచే జట్టుకి గెలిచే అర్హత ఉండదని భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఘాటుగా హెచ్చరించాడు. ఆదివారం రాత్రి వెస్టిండీస్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో ఓపెనర్ ఎవిన్ లూయిస్ ఇచ్చిన రెండు క్యాచ్‌ల్ని భారత్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. దీంతో చివరికి లూయిస్ 62 బంతుల్లోనే 6x4, 12x6 సాయంతో 125 పరుగులు చేసి వెస్టిండీస్‌ని ఒంటిచేత్తో గెలిపించాడు. మ్యాచ్ ఆరంభంలోనే లూయిస్ గాల్లోకి లేపిన బంతిని కోహ్లి క్యాచ్‌గా అందుకుంటున్న సమయంలోనే మధ్యలో క్యాచ్‌ కోసం దూరిన షమీ బంతిని నేలపాలు చేశాడు. తర్వాత కొద్దిసేపటికే దినేశ్ కార్తీక్ కూడా చేతుల్లో పడిన బంతిని తడబాటులో చేజార్చాడు.
Samayam Telugu virat kohli blames dropped catches for defeat vs west indies in one off t20i
క్యాచ్‌లు జారవిడిచే వారికి.. గెలిచే అర్హత లేదు


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్యాన్ని వెస్టిండీస్ వికెట్ మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలోనే ఛేదించేసింది. ‘భారత్ ఇంకా 25-30 పరుగులు అదనంగా చేసుంటే బాగుండేది. మ్యాచ్ ఆరంభంలోనే జట్టు స్కోరు 230కి చేరువవుతుందని ఆశించా. కానీ.. మిడిలార్డర్ అంచనాల మేర రాణించలేకపోయింది. ఫీల్డింగ్ మేము బాగానే చేశాం. కానీ.. రెండు క్యాచ్‌ల్ని వదిలేశాం. క్యాచ్‌లు జారవిడిచే వారికి గెలిచే అర్హత ఉండదు’ అని కోహ్లి వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.