భారత టెస్టు జట్టు మూడేళ్ల తర్వాత తుది జట్టులో మార్పులు లేకుండా తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడుతోంది. 2014 చివర్లో భారత టెస్టు జట్టు కెప్టెన్గా విరాట్ కోహ్లీ బాధ్యతలు స్వీకరించగా.. అప్పటి నుంచి అతని నాయకత్వంలో టీమిండియా 38 టెస్టులాడింది. కానీ.. ప్రతి టెస్టులోనూ తుది జట్టులో కోహ్లీ మార్పులు చేస్తూ వచ్చాడు. అయితే.. ఇంగ్లాండ్తో గురువారం ఆరంభమైన నాలుగో టెస్టులో మాత్రం కోహ్లీ తుది జట్టులో మార్పులు చేయకుండా.. మూడో టెస్టు ఆడిన జట్టునే కొనసాగించాడు. దీంతో.. మూడేళ్ల సుదీర్ఘ రికార్డ్కి ఈరోజు బ్రేక్ పడింది. తుది జట్టులో తరచూ మార్పులు చేస్తుండటంతో ఆటగాళ్లలో అభద్రతాభావం పెరుగుతోందని గత కొంతకాలంగా మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నా.. పట్టించుకోని కోహ్లీ.. తొలిసారి మనసు మార్చుకున్నాడు.
ఆస్ట్రేలియాతో 2014 చివర్లో భారత్ జట్టు టెస్టు సిరీస్ ఆడుతుండగా.. అనూహ్యంగా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో.. ఆ సిరీస్లోనే కోహ్లీ టెస్టు జట్టు బాధ్యతలు స్వీకరించాడు. అనంతరం భారత టెస్టు జట్టు శ్రీలంక, వెస్టిండీస్తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లు ఆడింది. ఈ క్రమంలో రెండు సార్లు టెస్టుల్లో నెం.1 ర్యాంక్ని కూడా అందుకుంది. అయినప్పటికీ.. ఏ తుది జట్టునీ రెండో టెస్టుకి కోహ్లీ కొనసాగించలేదు. కానీ.. ఇటీవల ఇంగ్లాండ్తో ముగిసిన మూడో టెస్టులో భారత్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించడంతో.. తొలిసారి తుది జట్టుని మార్చకుండా కోహ్లీ కొనసాగించాడు.
క్రికెట్ ప్రపంచంలో ఇప్పటి వరకు వరుసగా తుది జట్టులో ఎక్కువ మార్పులు చేసిన కెప్టెన్గా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ రికార్డుల్లో ఉన్నాడు. అతను 2003-2007 మధ్యకాలంలో 43 టెస్టుల్లో వరుసగా తుది జట్టులో మార్పులు చేశాడు. అతని తర్వాత కోహ్లీ 38 టెస్టులతో రెండో స్థానంలో తాజాగా నిలిచాడు.
ఆస్ట్రేలియాతో 2014 చివర్లో భారత్ జట్టు టెస్టు సిరీస్ ఆడుతుండగా.. అనూహ్యంగా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో.. ఆ సిరీస్లోనే కోహ్లీ టెస్టు జట్టు బాధ్యతలు స్వీకరించాడు. అనంతరం భారత టెస్టు జట్టు శ్రీలంక, వెస్టిండీస్తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లు ఆడింది. ఈ క్రమంలో రెండు సార్లు టెస్టుల్లో నెం.1 ర్యాంక్ని కూడా అందుకుంది. అయినప్పటికీ.. ఏ తుది జట్టునీ రెండో టెస్టుకి కోహ్లీ కొనసాగించలేదు. కానీ.. ఇటీవల ఇంగ్లాండ్తో ముగిసిన మూడో టెస్టులో భారత్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించడంతో.. తొలిసారి తుది జట్టుని మార్చకుండా కోహ్లీ కొనసాగించాడు.
క్రికెట్ ప్రపంచంలో ఇప్పటి వరకు వరుసగా తుది జట్టులో ఎక్కువ మార్పులు చేసిన కెప్టెన్గా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ రికార్డుల్లో ఉన్నాడు. అతను 2003-2007 మధ్యకాలంలో 43 టెస్టుల్లో వరుసగా తుది జట్టులో మార్పులు చేశాడు. అతని తర్వాత కోహ్లీ 38 టెస్టులతో రెండో స్థానంలో తాజాగా నిలిచాడు.