యాప్నగరం

Virat Kohli: మెల్‌బోర్న్‌‌లో అంపైర్‌తో గొడవపడిన కోహ్లి..!

19 ఓవర్‌ ఆరంభంలోనే వర్షం మొదలవగా.. అంపైర్లు మాత్రం.. ఓవర్ ముగిసే వరకూ భారత్‌‌తో బౌలింగ్ చేయించడంపై కోహ్లీ మండిపడ్డాడు. ఒకానొక దశలో అంపైర్‌పైకి దూసుకెళ్లిన కోహ్లి.. తన వాదనని బలంగా వినిపిస్తూ.. మైదానంలోనే కాసేపు నోటికి పనిచెప్పాడు

Samayam Telugu 23 Nov 2018, 6:02 pm
ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం ముగిసిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డ్ అంపైర్‌తో కాసేపు గొడవకి దిగాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 19 ఓవర్లు ముగిసే సమయానికి 132/7తో నిలిచిన దశలో వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే.. 19 ఓవర్‌ ఆరంభంలోనే వర్షం మొదలవగా.. అంపైర్లు మాత్రం.. ఓవర్ ముగిసే వరకూ భారత్‌‌తో బౌలింగ్ చేయించడంపై కోహ్లీ మండిపడ్డాడు. ఒకానొక దశలో అంపైర్‌పైకి దూసుకెళ్లిన కోహ్లి.. తన వాదనని బలంగా వినిపిస్తూ.. మైదానంలోనే కాసేపు నోటికి పనిచెప్పాడు. ఒకవేళ మ్యాచ్ రిఫరీకి ఫీల్డ్ అంపైర్లు దీనిపై ఫిర్యాదు చేస్తే..? ఐసీసీ నుంచి కోహ్లీకి చిన్నపాటి మందలింపు వచ్చే అవకాశం ఉంది. వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో దాదాపు గంటన్నరసేపు వేచి చూసిన అంపైర్లు.. రెండో టీ20 మ్యాచ్‌‌ని రద్దు చేసిన విషయం తెలిసిందే.
Samayam Telugu 800


వాస్తవానికి వర్షం పడేటప్పుడు ఏ దశలోనైనా మ్యాచ్‌ని నిలిపివేసే అధికారం అంపైర్లకి ఉంటుంది. గత బుధవారం బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లోనూ వర్షం రావడంతో 16.1 ఓవర్లలో ఆటని అంపైర్లు నిలిపివేసి.. వర్షం తర్వాత మ్యాచ్‌ని 17 ఓవర్లకి కుదించడంతో ఆసీస్‌‌తో మళ్లీ 17 ఓవర్‌లో మిగిలిన ఐదు బంతులను ఆడించిన విషయం తెలిసిందే. వర్షపు చినుకులు బంతిపై పడితే.. బౌలర్లకే కాదు.. ఫీల్డర్లకీ దానిపై పట్టుచిక్కదు. ఈ కారణంగానే కోహ్లీ.. మ్యాచ్‌ని నిలిపివేయాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అయితే.. మ్యాచ్‌‌లో అంపైర్ల నిర్ణయమే అంతిమం..!!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.