యాప్నగరం

నాలుగో వన్డేకి భారత్ జట్టులో మార్పులు..?

శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ జట్టు ఇప్పటికే 3-0తో చేజిక్కించుకున్న నేపథ్యంలో మిగిలిన రెండు

TNN 28 Aug 2017, 8:19 pm
శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ జట్టు ఇప్పటికే 3-0తో చేజిక్కించుకున్న నేపథ్యంలో మిగిలిన రెండు వన్డేలకి జట్టులో మార్పులు ఉండొచ్చని కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. వన్డే సిరీస్‌ కోసం సెలక్టర్లు 15 మందితో జట్టుని ఎంపిక చేయగా.. మూడు వన్డేలకి ఒకే తుది జట్టును కోహ్లి కొనసాగించాడు. మూడు వన్డేల్లోనూ తక్కువ స్కోరే ఛేదించాల్సి రావడంతో భారత్ టాప్ ఆర్డర్‌కి రెండో వన్డే మినహా పరీక్ష ఎదురుకాలేదు. గురువారం జరగనున్న నాలుగో వన్డేలో రహానె, మనీశ్ పాండే, శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లో కనీసం ఇద్దరికి చోటు దక్కే అవకాశం ఉంది.
Samayam Telugu virat kohli hints on changes in playing xi for remaining odis
నాలుగో వన్డేకి భారత్ జట్టులో మార్పులు..?


‘మిగిలిన రెండు వన్డేల్లో రిజర్వ్ బెంచ్‌లోని ఆటగాళ్లకి ఛాన్స్ ఇస్తాం. ఎందుకంటే ఇప్పటికే భారత్ జట్టు సిరీస్ గెలిచేసింది. లంక పిచ్‌‌లు బ్యాట్స్‌మెన్‌కి సవాల్ విసురుతున్నాయి. తక్కువ లక్ష్యాలను ఛేదించాల్సి వచ్చినా.. ఒక్కోసారి ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. రెండో వన్డేనే దానికి ఉదాహరణ. కాబట్టి మరీ ఎక్కువ ప్రయోగాలకు వెళ్లకుండా సాధ్యమైనంతగా సమతూకంగా తుదిజట్టుని ఎంచుకుంటాం. యువ క్రికెటర్లు అవకాశం కోసం ఓపికగా ఎదురుచూడక తప్పదు’ అని కోహ్లి వివరించాడు. మూడు వన్డేల్లోనూ బ్యాట్‌తో విఫలమైన కేదార్ జాదవ్‌పై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. అతని స్థానంలో
మనీశ్ పాండేకి ఛాన్స్ దొరకొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.