యాప్నగరం

విరాట్ కోహ్లీ ఏం కెప్టెన్సీ ఇది..? ఆశిష్ నెహ్రా పెదవి విరుపు

విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై విమర్శల వాడి రోజురోజుకి పెరుగుతోంది. బుమ్రా, షమీ లాంటి బౌలర్లు అందుబాటులో ఉన్నా.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయడంలో..?

Samayam Telugu 1 Dec 2020, 7:59 am
విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలపర్వం కొనసాగుతోంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు వన్డేల్లో భారత్ జట్టు ఓడిపోగా.. కెప్టెన్ కోహ్లీ పేలవ నిర్ణయాలే ఆ పరాజయాలకి కారణమని మాజీ క్రికెటర్లు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా కూడా చేరాడు. తొలి పవర్‌ప్లేలో జస్‌ప్రీత్ బుమ్రాతో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయించకపోవడం ఇప్పుడు అతి పెద్ద తప్పిదంగా ఇప్పటికే గౌతమ్ గంభీర్ అభిప్రాయపడగా.. ఆశిష్ నెహ్రా కూడా అదే తరహాలో కోహ్లీ కెప్టెన్సీ వైఫల్యాన్ని ఎత్తిచూపాడు.
Samayam Telugu Virat Kohli
విరాట్ కోహ్లీ


‘‘విరాట్ కోహ్లీ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా.. బౌలింగ్ మార్పు విషయంలో అతను మరోసారి పునరాలోచించుకోవాల్సిన సమయం ఇది. మహ్మద్ షమీతో రెండు ఓవర్లు వేయించి వెంటనే మరో పేసర్ నవదీప్ సైనీ చేతికి అతను బంతినిచ్చాడు. ఈ మార్పు ఓకే.. కానీ.. జస్‌ప్రీత్ బుమ్రాతోనూ ఆరంభంలో కేవలం రెండు ఓవర్ల స్పెల్ వేయించడమేంటి..?’’ అని నెహ్రా మండిపడ్డాడు.

జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలతో ఓ 4 ఓవర్ల స్పెల్ వేయించి ఉంటే..? బాగుండేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. కొత్త బంతితో ఈ ఇద్దరూ మెరుగ్గా బౌలింగ్ చేయగలరు. కానీ.. బుమ్రాతో కేవలం రెండు ఓవర్ల స్పెల్ వేయించడంతో రెండు వన్డేల్లోనూ ఆస్ట్రేలియా ఆరంభంలోనే భారీ స్కోర్లకి బాటలు వేసుకోగలిగింది. మూడో వన్డేలో బుధవారం జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.