యాప్నగరం

టెస్టులకి విరాట్ కోహ్లీ జీవం పోశాడు..!

క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు సూపర్‌స్టార్ల కొరత ఏర్పడింది. ఇంగ్లాండ్‌లో ఒకరిద్దరూ మాత్రమే ఆ స్థాయిలో ఆడుతున్నారు. ఇక భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి నిస్సందేహంగా సూపర్‌స్టారే.

Samayam Telugu 3 Nov 2018, 2:11 pm
క్రికెట్‌లో వన్డే, టీ20ల ప్రభావంతో ఆదరణ కోల్పోతున్న టెస్టులకి భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఆటతో మళ్లీ జీవం పోశాడని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ప్రశంసించాడు. ఈ ఏడాది బ్యాట్‌తో అసాధారణరీతిలో చెలరేగిపోయిన విరాట్ కోహ్లి రికార్డుల మోత మోగించాడు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో శతకం బాదిన కోహ్లి.. ఆ తర్వాత ఐదు వన్డేల సిరీస్‌లోనూ ఏకంగా మూడు సెంచరీలు సాధించాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో వేగంగా 10,000 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్‌‌మెన్‌గా నిలిచాడు.
Samayam Telugu 1533230011-AP_18214595156834


‘క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు సూపర్‌స్టార్ల కొరత ఏర్పడింది. ఇంగ్లాండ్‌లో ఒకరిద్దరూ మాత్రమే ఆ స్థాయిలో ఆడుతున్నారు. ఇక భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి నిస్సందేహంగా సూపర్‌స్టారే. అతను టెస్టుల్లో ఆడటాన్ని అమితంగా ఇష్టపడుతున్నాడు. కోహ్లి జోరు ఇలానే కొనసాగితే ఐదు రోజుల ఫార్మాట్‌ మళ్లీ మునుపటి ఆదరణ పొందడం ఖాయంగా కనిపిస్తోంది. ఆదరణ తగ్గిపోతున్న టెస్టులకి కోహ్లీ తన ఆటతో జీవంపోశాడు’ అని గ్రేమ్‌స్మిత్ వెల్లడించాడు.

భారత్, వెస్టిండీస్ మధ్య ఆదివారం రాత్రి ఈడెన్‌గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.