యాప్నగరం

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ హవా..!

దక్షిణాఫ్రికా జట్టును దాని సొంతగడ్డపైనే వన్డే సిరీస్‌లో చిత్తుగా ఓడించిన భారత్ జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని

TNN 20 Feb 2018, 4:46 pm
దక్షిణాఫ్రికా జట్టును దాని సొంతగడ్డపైనే వన్డే సిరీస్‌లో చిత్తుగా ఓడించిన భారత్ జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఐసీసీ మంగళవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో 122 పాయింట్లతో భారత్ నెం.1 స్థానంలో నిలవగా.. కోహ్లిసేన చేతిలో 1-5 తేడాతో సిరీస్‌ని చేజార్చుకున్న దక్షిణాఫ్రికా 117 పాయింట్లతో రెండో స్థానానికే పరిమితమైంది. ఆరు వన్డేల ఈ సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి మూడు శతకాలు బాది జట్టుని ముందుండి నడిపించగా.. మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ సంయుక్తంగా 33 వికెట్లు పడగొట్టి సఫారీల పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే.
Samayam Telugu virat kohli jasprit bumrah and india are no 1 in odi rankings
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ హవా..!


బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్ జాబితాలో విరాట్ కోహ్లి 909 పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. బౌలర్ల జాబితాలో జస్‌ప్రీత్ బుమ్రా 787 పాయింట్లతో నెం.1 స్థానానికి ఎగబాకగా.. చాహల్ 667 పాయింట్లతో 8వ స్థానానికి, కుల్దీప్ యాదవ్ 628 పాయింట్లతో 15వ స్థానానికి ఎగబాకారు. ఈ సిరీస్‌లోనే ఒక్కో శతకం బాదిన ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ టాప్-10లో చోటు దక్కించుకున్నారు. బుధవారం రాత్రి భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.