యాప్నగరం

భుజం నొప్పితో మైదానం వీడిన విరాట్..

రాంచీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఫీల్డింగ్ చేస్తుండగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి భుజానికి గాయమైంది.

TNN 16 Mar 2017, 1:31 pm
రాంచీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఫీల్డింగ్ చేస్తుండగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి భుజానికి గాయమైంది. బంతి బౌండరీ లైన్‌ను తాకకుండా ఆపే క్రమంలో విరాట్ కుడి చేతి భుజం నేలను బలంగా తాకడంతో కాసేపు నొప్పితో ఇబ్బందిపడ్డాడు. నొప్పి ఎక్కువగా ఉండటంతో వెంటనే మైదానం వీడాడు. దీంతో కోహ్లి స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా అజింక్య రహానే బాధ్యతలు చేపట్టాడు.
Samayam Telugu virat kohli leaving field after suffering freak shoulder injury
భుజం నొప్పితో మైదానం వీడిన విరాట్..


లంచ్ తర్వాత జడేజా వేసిన బంతిని హ్యాండ్స్‌కాంబ్ ఫుష్ చేయడంతో... పరిగెత్తుకుంటూ బౌండరీ లైన్‌ను తాకకుండా బంతిని ఆపిన కోహ్లి.. బ్యాలెన్స్ ఆపుకోలేక బౌండరీ ఆవల పడిపోయాడు. దీంతో అతడి కుడి చేతి భుజానికి గట్టిగానే దెబ్బతగిలింది. అది మరీ ఇబ్బంది పెట్టే గాయం కాకపోయినప్పటికీ.. కోహ్లిని మాత్రం అసౌకర్యానికి గురి చేసింది. వెంటనే మైదానంలోకి వచ్చి విరాట్‌ను పరీక్షించిన ఫిజియో భుజానికి చికిత్స కోసం కెప్టెన్‌ను తన వెంట తీసుకొని వెళ్లాడు. తర్వాత కోహ్లి షర్ట్ లేకుండా డ్రెస్సింగ్ రూంలో కనిపించాడు.

pic.twitter.com/0KclkNerFN — Harbhajan Turbanator (@cricketfreak07) March 16, 2017
తొలి రోజు 49 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ స్మిత్ 61 పరుగులతో, మ్యాక్స్‌వెల్ 5 రన్స్‌తో క్రీజులో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.