యాప్నగరం

కంగ్రాట్స్ చెప్పడంలో కోహ్లి తడబాటు..!

భారత జట్టు మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్‌కి అభినందనలు చెప్పే విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పొరబడ్డాడు

TNN 13 Jul 2017, 6:22 pm
భారత జట్టు మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్‌కి అభినందనలు చెప్పే విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పొరబడ్డాడు. మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగులు చేసిన మిథాలీ రాజ్‌ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. దీంతో ఆమెకి అభినందనలు చెప్పే క్రమంలో విరాట్ కోహ్లి.. పొరపాటున మిథాలీ రాజ్‌ ఫొటోకి బదులుగా ఓపెనర్ పూనమ్ రౌత్ ఫొటోని ఉపయోగించాడు. దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Samayam Telugu virat kohli mistakenly puts punam rauts photo while congratulating mithali raj
కంగ్రాట్స్ చెప్పడంలో కోహ్లి తడబాటు..!


‘భారత్‌ క్రికెట్‌కి గొప్ప క్షణం. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా మిథాలీరాజ్ రికార్డు నెలకొల్పింది’ అంటూ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చిన కోహ్లి పొరపాటున పూనమ్ రౌత్ ఫొటోతో దాన్ని పోస్ట్ చేశాడు. అయితే అభిమానుల విమర్శలతో వెంటనే ఆ పోస్ట్‌ని డిలీట్ చేసి మిథాలీరాజ్ ఫొటోతో మరోసారి పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్‌లో వైరల్‌గా మారింది. పాయింట్ దిశగా షాట్ కొట్టే ఫొటో కావడంతో కోహ్లి పొరబడినట్లు తెలుస్తోంది. వన్డేల్లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఎడ్‌వర్డ్స్ 5992 పరుగులతో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా మిథాలీ ఆ రికార్డును బద్దలుకొట్టి 6000 పరుగుల మైలురాయిని అందుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.