యాప్నగరం

చారిత్రక రికార్డుకి అడుగు దూరంలో కోహ్లి..!

వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో ఒక శతకం బాది సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. బలహీనమైన కరీబియన్ బౌలింగ్‌ని ఎదుర్కొని ఐదు వన్డేల్లో 221 పరుగులు చేయడం సులువే..!

Samayam Telugu 18 Oct 2018, 4:03 pm
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చారిత్రక రికార్డుకి అడుగు దూరంలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో ఆదివారం నుంచి ప్రారంభంకానున్న ఐదు వన్డేల సిరీస్‌లో కోహ్లి 221 పరుగులు చేస్తే.. వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఐదో భారత క్రికెటర్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు.
Samayam Telugu kohli-m3


భారత్ తరఫున ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), మహేంద్రసింగ్ ధోని (10,123) మాత్రమే ఈ మార్క్‌ని అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రికార్డుని ఇప్పటి వరకు 12 మంది క్రికెటర్లు అందుకోగా అందులో నలుగురు భారత క్రికెటర్లే ఉండటం గర్వకారణం.

శ్రీలంకతో ఆగస్టు 18, 2008లో జరిగిన వన్డే మ్యాచ్‌తో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లి.. అనతికాలంలోనే సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ దశాబ్దకాలంలో ఇప్పటి వరకు 211 వన్డేలాడిన కోహ్లీ 58.21 సగటుతో 9,779 పరుగులు చేశాడు. ఇందులో 35 శతకాలు, 48 అర్ధశతకాలు ఉండటం విశేషం.

వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో ఒక శతకం బాది సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. బలహీనమైన కరీబియన్ బౌలింగ్‌ని ఎదుర్కొని ఐదు వన్డేల్లో 221 పరుగులు చేయడం సులువే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.