ఇంగ్లాండ్తో సుదీర్ఘ పర్యటనకి ముందే.. అక్కడి పరిస్థితులపై అవగాహన తెచ్చుకునేందుకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కౌంటీలు ఆడాలనుకోవడంలో అర్థం లేదని ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ బాబ్ విల్స్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టు ఇంగ్లాండ్ గడ్డపై జులై 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు చివర్లో ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. ఆ గడ్డపై గతంలో పర్యటించిన కోహ్లి ఐదు టెస్టుల్లో కలిపి చేసిన పరుగులు 134 మాత్రమే. దీంతో.. ఈ ఏడాది పర్యటనలో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇందులో భాగంగా సిరీస్ ఆరంభానికి ముందే అక్కడికి వెళ్లి కౌంటీలు ఆడాలని కోహ్లి ఇటీవల నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
‘విదేశీ ఆటగాళ్లు ఇంగ్లాండ్లో కౌంటీలు ఆడటాన్ని నేను సమర్థించను. అలా అనుమతిస్తే స్థానిక యువ క్రికెటర్ల అవకాశాలు దెబ్బతింటాయి. ఇంగ్లాండ్ గడ్డపై గతంలో విఫలమైన కోహ్లి ఈ ఏడాది సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కానీ.. టెస్టు సిరీస్కి ముందు కౌంటీలు ఆడాలనుకోవడం అర్థంలేదు. సొంతగడ్డపై టెస్టు సిరీస్ని ఇంగ్లాండ్ చేజార్చుకోదు. విదేశీ ఆటగాళ్లపై ఆధిపత్యం చెలాయించడమెలాగో మా జట్టుకి బాగా తెలుసు’ అని బాబ్ విల్స్ ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల్లో సత్తాచాటిన కోహ్లి.. ఇంగ్లాండ్ గడ్డపై కూడా టెస్టుల్లో రాణిస్తాడేమో..? చూడాలి..!
‘విదేశీ ఆటగాళ్లు ఇంగ్లాండ్లో కౌంటీలు ఆడటాన్ని నేను సమర్థించను. అలా అనుమతిస్తే స్థానిక యువ క్రికెటర్ల అవకాశాలు దెబ్బతింటాయి. ఇంగ్లాండ్ గడ్డపై గతంలో విఫలమైన కోహ్లి ఈ ఏడాది సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కానీ.. టెస్టు సిరీస్కి ముందు కౌంటీలు ఆడాలనుకోవడం అర్థంలేదు. సొంతగడ్డపై టెస్టు సిరీస్ని ఇంగ్లాండ్ చేజార్చుకోదు. విదేశీ ఆటగాళ్లపై ఆధిపత్యం చెలాయించడమెలాగో మా జట్టుకి బాగా తెలుసు’ అని బాబ్ విల్స్ ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల్లో సత్తాచాటిన కోహ్లి.. ఇంగ్లాండ్ గడ్డపై కూడా టెస్టుల్లో రాణిస్తాడేమో..? చూడాలి..!