యాప్నగరం

కోహ్లికి ఓటమి ఆలోచనే ఉండదు..!

భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లి మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా.. ఓటమి గురించి అసలు ఆలోచించడని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్

TNN 6 Feb 2018, 11:37 am
భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లి మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా.. ఓటమి గురించి అసలు ఆలోచించడని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. గత కొన్నినెలలుగా టీమిండియా వన్డే, టీ20 జట్టులో చోటు కోల్పోయిన అశ్విన్.. ప్రస్తుతం దేశవాళీ టోర్నీ విజయ హజారే ట్రోఫీ‌లో తమిళనాడు తరఫున ఆడుతున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మంగళవారం మాట్లాడిన అశ్విన్.. సఫారీ గడ్డపై జట్టుని విరాట్ కోహ్లి సమర్థంగా నడిపిస్తున్నాడని కితాబిచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆరు వన్డేల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మూడో వన్డే కేప్‌టౌన్ వేదికగా బుధవారం జరగనుంది.
Samayam Telugu virat kohli plays to win no negative bone in his body ashwin
కోహ్లికి ఓటమి ఆలోచనే ఉండదు..!


‘విరాట్ కోహ్లి ఎప్పుడూ గెలుపు కోసం పరితపిస్తుంటాడు. అతనికి అసలు ఓటమి ఆలోచనలే రావు. మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా సరే.. విజయం గురించే మాట్లాడతాడు. ఇది జట్టులోని ఆటగాళ్లలో మరింత స్ఫూర్తి రగిలిస్తోంది. టీమిండియాకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి ఇదే తొలి దక్షిణాఫ్రికా పర్యటన. ఒకరకరంగా చెప్పాలంటే.. తొలి విదేశీ కఠిన పర్యటన. ఇప్పటి వరకు భారత జట్టు అత్యుత్తమ కెప్టెన్లందరూ స్వదేశంలో మంచి రికార్డులు నెలకొల్పి.. విదేశాల్లో తమ నాయకత్వాన్ని పరీక్షించుకున్నారు. విరాట్ కోహ్లి కూడా ఇప్పటికే స్వదేశంలో విజయవంతమైన కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు.. ఇప్పుడు సఫారీ గడ్డపై సత్తా చాటుతున్నాడు’ అని అశ్విన్ వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.