యాప్నగరం

దెబ్బడిపోయింది.. రాంచీ టెస్టుకు విరాట్ దూరం!

రాంచీ టెస్టులో భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తొలి రోజు ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన టీమిండియా కెప్టెన్ కోహ్లి

TNN 16 Mar 2017, 9:00 pm
రాంచీ టెస్టులో భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తొలి రోజు ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన టీమిండియా కెప్టెన్ కోహ్లి ఈ టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. జడేజా బౌలింగ్‌లో హ్యాండ్స్‌కాంబ్ షాట్ కొట్టగా.. అది బౌండరీ దిశగా వెళ్లింది. దాన్ని ఆపే క్రమంలో పరిగెత్తుకుంటూ వెళ్లిన కోహ్లి బంతిని వెనక్కి నెట్టినప్పటికీ కింద పడిపోయాడు. కుడి భుజం మీదే శరీరం బరువు మొత్తం పడటంతో నొప్పితో విలవిల్లాడాడు. దీంతో మైదానం విడిచి వెళ్లాడు. విరాట్ స్థానంలో అజింక్య రహానే జట్టును నడిపించాడు.
Samayam Telugu virat kohli ruled out of ranchi test
దెబ్బడిపోయింది.. రాంచీ టెస్టుకు విరాట్ దూరం!


విరాట్‌ను ఫిజియో పరీక్షించిన ఐస్ ప్యాక్‌లను భుజంపై ఉంచి ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నించారు. దీంతో విరాట్ ఫీల్డింగ్‌కు రాలేదు. గురువారం సాయంత్రానికి విరాట్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి స్కానింగ్ చేయించారు. స్కానింగ్ రిపోర్టుల ప్రకారం కోహ్లికి కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో విరాట్ మూడో టెస్టుకు దూరమయ్యాడని సమాచారం. కాగా రేపు ఉదయానికి కోహ్లి స్కానింగ్ రిపోర్టులు వస్తాయని బీసీసీఐ వెల్లడించింది. ఇదే నిజమైతే విరాట్ గైర్హాజరీ భారత బ్యాటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

తొలి రోజు ఆసీస్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. స్మిత్ 117 పరుగులతో, మ్యాక్స్‌వెల్ 82 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.