యాప్నగరం

కోహ్లికి కోపం తెప్పించిన దక్షిణాఫ్రికా బోర్డు

భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కోపం తెప్పించింది. టీమిండియా ప్రాక్టీస్ కోసం అక్కడి పరిస్థితులకి అనుగుణంగా పచ్చికతో

TNN 1 Jan 2018, 6:39 pm
భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కోపం తెప్పించింది. టీమిండియా ప్రాక్టీస్ కోసం అక్కడి పరిస్థితులకి అనుగుణంగా పచ్చికతో కూడిన పిచ్‌ను భారత్ టీమ్ మేనేజ్‌మెంట్ అడిగితే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మాత్రం జీవం లేని పిచ్‌ను కేటాయించడాన్ని కోహ్లి తప్పుబట్టాడు. ప్రాక్టీస్‌కి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో వార్మప్ మ్యాచ్‌ని సైతం రద్దు చేసుకున్న కోహ్లిసేనకి ఇది మింగుడపడటం లేదు. కేప్ టౌన్ వేదికగా శుక్రవారం నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది.
Samayam Telugu virat kohli unhappy with practice pitch in south africa asks for green wicket
కోహ్లికి కోపం తెప్పించిన దక్షిణాఫ్రికా బోర్డు


జీవం లేని పిచ్‌ ఇవ్వడంపై మీడియాతో కోహ్లి మాట్లాడుతూ ‘దక్షిణాఫ్రికా పరిస్థితులకి అనుగుణంగా పిచ్‌ను తయారు చేసి ఇవ్వమన్నాం. కానీ.. వాళ్లు ఏ మాత్రం పచ్చిక లేని పిచ్‌ని మాకు ప్రాక్టీస్ కోసం కేటాయించారు. ఈ తరహా జీవం లేని పిచ్‌పై ఫాస్ట్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేసినా అది సిరీస్‌లో మాకు అక్కరకు రాదు. ఇలా నాణ్యత లేని పిచ్‌ను టీమిండియాకి ఎందుకు కేటాయించనట్లో..?’ అని కోహ్లి పెదవి విరిచాడు. భారత్ కోరిన పిచ్‌ను తయారు చేయడానికి ప్రయత్నించాం.. కానీ.. సిబ్బంది అనుభవలేమితో అది విఫలమైనట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.