టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య ఇప్పటికీ ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందా..? 2019 వన్డే ప్రపంచకప్లో ఈ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తగా.. అవి పూర్తిగా సర్దుకున్నట్లు టీమిండియా మేనేజ్మెంట్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. కానీ.. మైదానంలో ఇద్దరి మధ్య మునుపటి తరహాలో సఖ్యత లేకపోవడంతో.. అప్పుడప్పుడు ఇద్దరి మధ్య వైరం బహిరంగంగానే కనిపిస్తూ వచ్చింది. టీ20 వరల్డ్కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నట్లు విరాట్ కోహ్లీ గురువారం ప్రకటించగా.. కెప్టెన్సీ రేసులో రోహిత్ శర్మ ముందు వరుసలో కనిపిస్తున్నాడు. కానీ.. ఇదే సమయంలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. టీమిండియా సెలక్షన్ కమిటీతో ఇటీవల టీ20 వరల్డ్కప్ జట్టు ఎంపిక గురించి మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ఆ సమయంలో రోహిత్ శర్మని వైస్ కెప్టెన్ హోదా నుంచి తప్పించాలని ప్రతిపాదించాడట. కుర్రాళ్ల క్రికెట్గా పేరొందిన టీ20 వరల్డ్కప్లో 34 ఏళ్ల రోహిత్ శర్మని వైస్ కెప్టెన్గా కొనసాగించడం తగదని చెప్పుకొచ్చిన కోహ్లీ.. 29 ఏళ్ల కేఎల్ రాహుల్ లేదా 23 ఏళ్ల రిషబ్ పంత్కి ఆ బాధ్యతలు అప్పగించాలని సెలక్షన్ కమిటీని కోరినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంతో.. సెలక్షన్ కమిటీ సభ్యులు కూడా ఆశ్చర్యానికి గురైయ్యారట.
విరాట్ కోహ్లీ ప్రతిపాదనపై బీసీసీఐలో తీవ్ర స్థాయిలో చర్చలు జరగగా.. అవి చివరికి కోహ్లీ టీ20 కెప్టెన్సీకే ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్కప్ జరగనుండగా.. ఈ టోర్నీలో ఒకవేళ భారత్ జట్టుని కోహ్లీ విజేతగా నిలపలేకపోతే.. అతడ్ని టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని బీసీసీఐ పెద్దలు ప్రాథమికంగా నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. దాంతో.. కోహ్లీనే గౌరవంగా కెప్టెన్సీ నుంచి ముందుగానే తప్పుకోబోతున్నట్లు ప్రకటించాడని తెలుస్తోంది.
విరాట్ కోహ్లీ ప్రతిపాదనపై బీసీసీఐలో తీవ్ర స్థాయిలో చర్చలు జరగగా.. అవి చివరికి కోహ్లీ టీ20 కెప్టెన్సీకే ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్కప్ జరగనుండగా.. ఈ టోర్నీలో ఒకవేళ భారత్ జట్టుని కోహ్లీ విజేతగా నిలపలేకపోతే.. అతడ్ని టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని బీసీసీఐ పెద్దలు ప్రాథమికంగా నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. దాంతో.. కోహ్లీనే గౌరవంగా కెప్టెన్సీ నుంచి ముందుగానే తప్పుకోబోతున్నట్లు ప్రకటించాడని తెలుస్తోంది.