యాప్నగరం

మ్యాచ్ మధ్యలో వాకీటాకీ వాడిన కోహ్లి

భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆట మధ్యలో వాకీటాకీని వాడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫిరోజ్ షా కోట్ల వేదికగా న్యూజిలాండ్‌తో

TNN 2 Nov 2017, 4:07 pm
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆట మధ్యలో వాకీటాకీని వాడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫిరోజ్ షా కోట్ల వేదికగా న్యూజిలాండ్‌తో బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లి మ్యాచ్ మధ్యలో వాకీ టాకీని వినియోగించాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం మ్యాచ్ జరుగుతుండగా క్రికెటర్ మొబైల్ ఫోన్, ల్యాండ్ ఫోన్, ల్యాప్‌టాప్‌తో పాటు ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఏ ఎలక్ట్రానిక్ పరికరాన్ని వాడకూడదు. కానీ.. వాకీటాకీని వాడొచ్చని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
Samayam Telugu virat kohlis walkie talkie usage during india new zealand t20i within icc parameters
మ్యాచ్ మధ్యలో వాకీటాకీ వాడిన కోహ్లి


‘సాధారణంగా జట్టు సహాయ సిబ్బంది మాత్రమే వాకీ టాకీలను స్టేడియంలో వినియోగిస్తుంటారు. అయితే.. క్రికెటర్‌ కూడా కమ్యూనికేషన్ కోసం వాకీ టాకీని వాడవచ్చు. కానీ.. మ్యాచ్ అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తప్పనిసరి’ అని బీసీసీఐ అంపైర్ ఒకరు తెలిపారు. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే విరాట్ కోహ్లి వాకీ టాకీని వినియోగించాడని.. ఐసీసీ కూడా కోహ్లి ఎలాంటి తప్పు చేయలేదంటూ తాజాగా క్లీన్ చిట్ ఇచ్చిందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ మ్యాచ్‌లో భారత్ 53 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

Kohli is using what looks like a walkie-talkie. Are cricketers allowed to use that during a match? #INDvNZ #T20 #FifteenthOver pic.twitter.com/4vu5wSYPaZ — Pradeep P Bomble (@pradeeppb26) November 1, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.