యాప్నగరం

విరాట్ కోహ్లీకి రూల్స్ వర్తించవా..? ఉతికారేసిన వీరేంద్ర సెహ్వాగ్

ఆస్ట్రేలియాతో తొలి టీ20లో మనీశ్ పాండే రూపంలో అదనపు బ్యాట్స్‌మెన్‌ని జట్టులోకి కోహ్లీ తీసుకున్నాడు. దాంతో.. ఫామ్‌లో ఉన్న జడేజా నెం.7లో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.

Samayam Telugu 5 Dec 2020, 7:55 am
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీరుపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో శ్రేయాస్‌ అయ్యర్, చాహల్‌కి తుది జట్టులో చోటివ్వని విరాట్ కోహ్లీ.. మనీశ్ పాండే, సంజు శాంసన్‌లను టీమ్‌లోకి తీసుకున్నాడు. దాంతో.. ఏ కారణంతో శ్రేయాస్ అయ్యర్‌పై వేటు వేశావు..? అని సెహ్వాగ్ ప్రశ్నించాడు. మ్యాచ్‌లో మనీశ్ పాండే 2 పరుగులకే ఔటవగా.. సంజు శాంసన్ 23 పరుగులు చేసి వికెట్ చేజార్చుకున్నాడు.
Samayam Telugu Virender Sehwag, Virat Kohli (Image Credits: Twitter)


‘‘శ్రేయాస్ అయ్యర్ తాను చివరిగా ఆడిన టీ20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. మరి ఏ కారణంతో తొలి టీ20లో అతనిపై విరాట్ కోహ్లీ వేటు వేశాడు..? ఇదే ప్రశ్నని అడిగేందుకు శ్రేయాస్ అయ్యర్‌కి ధైర్యం లేదు. ఇక్కడ మరో విషయం చెప్పాలనుకుంటున్నా. టీమిండియాలో రూల్స్ అందరికీ వర్తిస్తాయి.. విరాట్ కోహ్లీకి తప్ప. ఎందుకు అతని విషయంలో మాత్రం నిబంధనల్ని పట్టించుకోరు. అతనికిష్టమొచ్చినట్లు బ్యాటింగ్ ఆర్డర్‌ని మారుస్తాడు.. ఆటగాళ్లపై వేటు వేస్తాడు.. ఫామ్‌లో లేకపోయినా రెస్ట్ తీసుకుంటాడు. ఇది తప్పు’’ అని సెహ్వాగ్ మండిపడ్డాడు.

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత నెం.4 బ్యాట్స్‌మెన్‌ గురించి అతిగా చర్చ జరిగింది. దాంతో.. ఆ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కి వరుసగా భారత సెలెక్టర్లు అవకాశమివ్వగా.. వన్డే, టీ20ల్లో అతను నిలకడగా రాణించాడు. కానీ.. తాజాగా తొలి టీ20లో అతనిపై వేటు వేయడం ద్వారా.. మళ్లీ నెం.4 విషయంలో సంక్షోభం తీసుకురాబోతున్నారని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.