యాప్నగరం

ఎంసీసీలో వీవీఎస్‌కి జీవితకాల సభ్యత్వం

. ఇప్పటి వరకు భారత్‌ నుంచి సచిన్ తెందుల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, జహీర్ ఖాన్ మాత్రమే ఈ సభ్యత్వాన్ని అందుకున్నారు

TNN 11 May 2017, 6:22 pm
భారత మాజీ సొగసరి బ్యాట్స్‌మెన్ వీవీఎస్‌ లక్ష్మణ్‌కి అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక మెర్లిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అతనికి జీవితకాల సభ్యత్వం అందజేస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు భారత్‌ నుంచి సచిన్ తెందుల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, జహీర్ ఖాన్ మాత్రమే ఈ సభ్యత్వాన్ని అందుకున్నారు. 16 ఏళ్ల పాటు సుదీర్ఘంగా భారత్ జట్టుకి ప్రాతినిథ్యం వహించిన వీవీఎస్ లక్ష్మణ్ 134 టెస్టులాడి 17 శతకాలు.. 56 అర్ధశతకాల సాయంతో 8,871 పరుగులు చేశాడు. వన్డే కెరీర్‌కి ఈ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ తొందరగానే రిటైర్మెంట్ ఇచ్చినా ఆడిన 86 వన్డేల్లోనే 6 శతకాలు.. 10 అర్ధ శతకాల సాయంతో 2,338 పరుగులు చేశాడు. జూన్, 2012న లక్ష్మణ్ తన చివరి టెస్టు మ్యాచ్ ఆడి కెరీర్‌కి వీడ్కోలు చెప్పాడు.
Samayam Telugu vvs laxman awarded honorary life membership by mcc
ఎంసీసీలో వీవీఎస్‌కి జీవితకాల సభ్యత్వం


ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మెంటార్‌గా పనిచేస్తున్న లక్ష్మణ్.. ఆ జట్టు విజయాల్లో తెరవెనుక కీలకపాత్ర పోషిస్తున్నాడు. గత ఏడాది టోర్నీ విజేతగా నిలిచిన హైదరాబాద్ ప్రస్తుత సీజన్‌లో కూడా 13 మ్యాచ్‌లాడి 15 పాయింట్లతో ప్లేఆఫ్ రేసులో సజీవంగా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.