యాప్నగరం

నొప్పి ఉన్నా.. భారత్‌పై ఆవేశంతో బౌలింగ్ చేశా

టోర్నీలో అది మాకు తొలి మ్యాచ్ కావడంతో తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగాం. వాస్తవంగా చెప్పాలంటే మూడు ఓవర్లు బౌలింగ్

TNN 21 Jun 2017, 8:49 pm
మోకాలి నొప్పి ఒకవైపు బాధిస్తున్నా.. భారత్‌ బ్యాట్స్‌మెన్‌ని నియంత్రించాలనే పట్టుదలతో ఛాంపియన్స్ ట్రోఫీలో తాను బౌలింగ్ చేసినట్లు పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ వాహబ్ రియాజ్ వెల్లడించాడు. టోర్నీ గ్రూప్ దశలో భాగంగా జూన్ 4న భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 8.4 ఓవర్లు బౌలింగ్ చేసిన రియాజ్ 87 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. బౌలింగ్ చేస్తుండగానే మోకాలి గాయంతో ఓవర్ మధ్యలోనే డగౌట్‌కి వెళ్లిపోయాడు.
Samayam Telugu was difficult for me to sit and watch pakistan play
నొప్పి ఉన్నా.. భారత్‌పై ఆవేశంతో బౌలింగ్ చేశా


‘టోర్నీలో అది మాకు తొలి మ్యాచ్ కావడంతో తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగాం. వాస్తవంగా చెప్పాలంటే మూడు ఓవర్లు బౌలింగ్ చేయగానే నాకు మోకాలి నొప్పి మొదలైంది. కానీ.. భారత్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడుతున్నారు. వారిని నియంత్రించాలని పట్టుదలతో బౌలింగ్ చేశాను. కానీ.. మరో 4 ఓవర్లు బౌలింగ్ చేసే సరికి నొప్పి తారాస్థాయికి చేరింది. దీంతో కనీసం నిలబడలేకపోయాను’ అని రియాజ్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ అనంతరం రియాజ్ టోర్నీలో మరో మ్యాచ్ ఆడలేకపోయాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ని పాకిస్థాన్ మొదటిసారి గెలవడం చాలా సంతోషంగా ఉందని.. జట్టుగా ఆడటంతోనే ఈ విజయం సాధ్యమైందని ఫాస్ట్ బౌలర్ వివరించాడు. కారణం ఏదైనా జట్టు మైదానంలో ఆడుతున్నప్పుడు.. డగౌట్‌లో కూర్చోవడం వర్ణించలేని బాధని రియాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.