యాప్నగరం

ధోనీ రూ. 30 లక్షల కోసం క్రికెట్: జాఫర్

క్రికెట్ ప్రపంచంలో ఎక్కువగా ఆర్జిస్తున్న క్రికెటర్లలో ధోనీ కూడా ఒకడు. కానీ.. టీమిండియాలోకి వచ్చిన కొత్తలో ధోనీ రూ. 30 లక్షలు సంపాదిస్తే చాలు అనుకున్నాడట. కానీ.. ఇప్పుడు ధోనీ ఆస్తుల విలువ రూ. 800 కోట్లు.

Samayam Telugu 29 Mar 2020, 7:34 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కేవలం రూ. 30 లక్షల కోసం అప్పట్లో క్రికెట్ ఆడినట్లు మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ వెల్లడించాడు. 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ధోని.. తొలి మ్యాచ్‌లోనే లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ డకౌటయ్యాడు. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల్లోనూ అతను చేసిన పరుగులు 22 మాత్రమే. అయితే.. పాకిస్థాన్‌తో వైజాగ్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో 148 పరుగులతో చెలరేగిన ధోనీ.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
Samayam Telugu MS Dhoni Retairment


Read More: ధోనీ రీఎంట్రీపై ఆసీస్ స్పిన్న‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

రాంచీలో తాను ప్రశాంతంగా జీవించేందుకు రూ. 30 లక్షలు ఉంటే చాలని ధోనీ అప్పట్లో తనకి చెప్పినట్లు జాఫర్ తాజాగా వెల్లడించాడు. ‘‘అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కొత్తలో ధోనీ నాతో ఓ సారి మాట్లాడుతూ.. తాను క్రికెట్ ఆడటం ద్వారా రూ. 30 లక్షలు సంపాదించుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఆ డబ్బుతో రాంచీలో ప్రశాంతమైన జీవితం తాను గడపగలనని అప్పట్లో ధోనీ నాకు చెప్పినట్లు గుర్తు’’ అని జాఫర్ తెలిపాడు.

Read More: ధోనీ విరాళం రూ. 1లక్ష.. ట్విట్టర్‌లో దుమారం

వైజాగ్ వన్డేలో శతకం తర్వాత టీమ్‌లో తిరుగులేని స్థాయికి ఎదిగిన ధోనీ.. కెప్టెన్‌గా 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ ఆ తర్వాత 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు. క్రికెట్ ప్రపంచంలో ఈ తరహాలో ఇప్పటి వరకూ ఏ కెప్టెన్ కూడా మూడు ఐసీసీ టోర్నీలు గెలవలేదు. అనధికార లెక్కల ప్రకారం ప్రస్తుతం ధోనీ ఆస్తుల విలువ సుమారు రూ. 800 కోట్లు కావడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.