యాప్నగరం

ఇంగ్లాండ్ సత్తా నిరూపించుకోవాల్సిందే..!

పాకిస్థాన్ చేతిలో సొంతగడ్డపై ఇటీవల తొలి టెస్టులో ఓడిన ఇంగ్లాండ్ జట్టు.. తీవ్ర ఒత్తిడి మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టులో బరిలోకి దిగనుంది. లార్డ్స్

Samayam Telugu 1 Jun 2018, 1:52 pm
పాకిస్థాన్ చేతిలో సొంతగడ్డపై ఇటీవల తొలి టెస్టులో ఓడిన ఇంగ్లాండ్ జట్టు.. తీవ్ర ఒత్తిడి మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టులో బరిలోకి దిగనుంది. లార్డ్స్ వేదికగా జరిగిన ఆ టెస్టులో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో పాక్ 9 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. గత కొద్దిరోజులుగా టెస్టుల్లో అనూహ్య పరాజయాలు ఎదుర్కొంటున్న ఇంగ్లాండ్ జట్టు.. చివరిగా ఆడిన 8 మ్యాచ్‌ల్లో గెలిచింది రెండింటిలో మాత్రమే. దీనికి తోడు మొదటి టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడిన ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ రెండో టెస్టుకి దూరమవడం ఆ జట్టుని మరింత ఒత్తిడిలోకి నెడుతోంది. మరోవైపు ఈ రెండో టెస్టులో కూడా గెలిచి సిరీస్‌ని 2-0 కైవసం చేసుకోవాలని పాక్ ఆశిస్తోంది.
Samayam Telugu we have a point to prove says skipper joe root ahead of headingley test
ఇంగ్లాండ్ సత్తా నిరూపించుకోవాల్సిందే..!


‘ఇంగ్లాండ్ జట్టు సత్తా నిరూపించుకోవాల్సిన సమయమిదే. బెన్‌స్టోక్స్ రెండో టెస్టుకి అందుబాటులో ఉండింటే బాగుండేది. అతను మా జట్టులో బెస్ట్ క్రికెటర్. తుది జట్టులో ఉండింటే.. బౌలింగ్, బ్యాటింగ్‌ రూపంలో జట్టుకి అదనపు ప్రయోజనాలు చేకూరేవి. జట్టు వరుసగా విజయాలు సాధిస్తుంటే.. సమీక్ష అవసరం ఉండేది కాదు. కానీ.. పరాజయాలు ఎదురవుతున్న వేళ.. తప్పకుండా వెనుదిరిగి చూసుకోవాల్సిందే’ అని ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.