యాప్నగరం

కోహ్లి కాచుకో.. రాంచీలో నువ్వే మా టార్గెట్

రాంచీ వేదికగా శనివారం రాత్రి జరగనున్న తొలి టీ20లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ తీయడమే.. ఆస్ట్రేలియా మొదటి టార్గెట్

Samayam Telugu 7 Oct 2017, 4:18 pm
రాంచీ వేదికగా శనివారం రాత్రి జరగనున్న తొలి టీ20లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ తీయడమే.. ఆస్ట్రేలియా మొదటి టార్గెట్ అని ఆ జట్టు వికెట్ కీపర్ టిమ్‌పైనీ వెల్లడించాడు. వన్డే సిరీస్‌లో వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న మాథ్యూ వెడ్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. దీంతో అతనిపై టీ20ల్లో వేటు వేసిన సెలక్టర్లు టిమ్‌పైనీని జట్టులోకి తీసుకున్నారు. కెరీర్‌లో ఇప్పటి వరకు 26 వన్డేలు, 4 టెస్టులు, 10 టీ20లు మాత్రమే ఆడిన టిమ్.. భారత్‌పై ఈ టీ20 సిరీస్‌లో మెరుగ్గా రాణించి జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని ఆశిస్తున్నాడు. రాత్రి 7 గంటలకి మ్యాచ్ ఆరంభంకానుంది.
Samayam Telugu we have got a couple of plans against virat kohli
కోహ్లి కాచుకో.. రాంచీలో నువ్వే మా టార్గెట్


‘రాంచీ టీ20లో విరాట్ కోహ్లి వికెట్ మాకు చాలా కీలకం. ఎందుకంటే ఆసీస్‌పై ఈ ఫార్మాట్‌లో అతనికి మంచి రికార్డు ఉంది. నిన్న రాత్రి టీమ్ మీటింగ్‌లో కూడా విరాట్ కోహ్లి వికెట్ తీయడం గురించి సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ వివరాలను ప్రస్తుతం నేను బహిర్గతం చేయలేను. కానీ.. అతని కోసం మా జట్టు రెండు ప్రణాళికల్ని మాత్రం సిద్ధం చేసి ఉంచింది. అవి ఎంతమేర సఫలం అవుతాయో మ్యాచ్‌లో తెలుస్తుంది’ అని టిమ్‌పైనీ ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవల ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌ని ఆస్ట్రేలియా 1-4తేడాతో చేజార్చుకున్న విషయం తెలిసిందే. గాయం కారణంగా స్టీవ్‌స్మిత్ జట్టుకి దూరమవగా.. ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.