ధర్మశాల వన్డేలో చేసిన తప్పిదాల్ని భారత్ జట్టు దిద్దుకున్నట్లు ఓపెనర్ శిఖర్ ధావన్ వెల్లడించాడు. శ్రీలంకతో విశాఖపట్నం వేదికగా ఆదివారం.. సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే జరగనున్న నేపథ్యంలో మీడియాతో శనివారం ఈ ఓపెనర్ మాట్లాడాడు. గత ఆదివారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక పేసర్ల ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 112 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. దీంతో పేస్ పిచ్లపై భారత్ బ్యాట్స్మెన్ బలహీనత మరోసారి బయటపడిందని.. ఇదే తరహా పిచ్లుండే దక్షిణాఫ్రికాలో భారత్ జట్టుకి జనవరిలో నిరాశ తప్పదంటూ కొంతమంది విమర్శలు గుప్పించారు. అయితే.. మొహాలి వేదికగా గత బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టు 392 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఇందులో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేయగా.. శ్రేయాస్ అయ్యర్ (88), శిఖర్ ధావన్ (68) అర్ధశతకాలు బాదేశారు.
‘శ్రీలంకతో సిరీస్లో భారత్ జట్టు చాలా నేర్చుకుంది. ముఖ్యంగా ధర్మశాలలో జరిగిన తొలి వన్డే తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంది. ఆ రోజు ధర్మశాల మైదానం పేస్కి అనుకూలించింది. మరోసారి అలాంటి పిచ్లు ఎదురైనా.. సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తాం. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఎదురైనా.. అవి మంచికే. ఎందుకంటే.. వాటి నుంచే మనం ఎక్కువ గుణపాఠాలు నేర్చుకుంటాం’ అని ధావన్ వివరించాడు. ధర్మశాల వన్డేలో ఆఫ్ స్టంప్కి సమీపంలో వెళ్తున్న బంతుల్ని.. పాదాలు కదల్చకుండా ఆడి వికెట్ సమర్పించుకున్న భారత్ టాప్ ఆర్డర్ ఆటగాళ్లు.. మొహాలిలో మాత్రం కొద్దిగా క్రీజు వెలుపలికి వచ్చి షాట్లు ఆడి విజయవంతమయ్యారు.
‘శ్రీలంకతో సిరీస్లో భారత్ జట్టు చాలా నేర్చుకుంది. ముఖ్యంగా ధర్మశాలలో జరిగిన తొలి వన్డే తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంది. ఆ రోజు ధర్మశాల మైదానం పేస్కి అనుకూలించింది. మరోసారి అలాంటి పిచ్లు ఎదురైనా.. సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తాం. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఎదురైనా.. అవి మంచికే. ఎందుకంటే.. వాటి నుంచే మనం ఎక్కువ గుణపాఠాలు నేర్చుకుంటాం’ అని ధావన్ వివరించాడు. ధర్మశాల వన్డేలో ఆఫ్ స్టంప్కి సమీపంలో వెళ్తున్న బంతుల్ని.. పాదాలు కదల్చకుండా ఆడి వికెట్ సమర్పించుకున్న భారత్ టాప్ ఆర్డర్ ఆటగాళ్లు.. మొహాలిలో మాత్రం కొద్దిగా క్రీజు వెలుపలికి వచ్చి షాట్లు ఆడి విజయవంతమయ్యారు.