యాప్నగరం

భారత్ వికెట్లు ఇంకా పడాలనుకున్నా..! : బుమ్రా

మెల్‌బోర్న్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. ఈరోజే ఇంకొన్ని వికెట్లు పడుంటే బాగుండేదని నాకు అనిపించింది. -జస్‌ప్రీత్ బుమ్రా

Samayam Telugu 28 Dec 2018, 4:02 pm
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఈరోజు భారత్ వికెట్లు ఇంకా పడింటే బాగుండేదని ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అభిప్రాయపడ్డాడు. ఆటలో మూడో రోజైన శుక్రవారం 8/0తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు.. జస్‌ప్రీత్ బుమ్రా (6/33) ధాటికి 151 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో.. 292 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న భారత్ జట్టు ఈరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో పేలవంగా వికెట్లు చేజార్చుకుని 54/5తో నిలిచింది. అయితే.. ఇప్పటికే 346 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో ఈరోజు ఇంకా కొన్ని వికెట్లు పడుంటే బాగుండేదని బుమ్రా చెప్పుకొచ్చాడు.
Samayam Telugu we lost a few more wickets that we wanted to jasprit bumrah
భారత్ వికెట్లు ఇంకా పడాలనుకున్నా..! : బుమ్రా


‘మెల్‌బోర్న్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. ఈరోజే ఇంకొన్ని వికెట్లు పడుంటే బాగుండేదని నాకు అనిపించింది. శనివారం తొలి సెషన్‌లో మరికొన్ని పరుగులు జోడించి.. ఆ తర్వాత ఆస్ట్రేలియాని ఆలౌట్ చేసేందుకు ఉపక్రమిస్తాం’ అని జస్‌ప్రీత్ బుమ్రా వెల్లడించాడు. పిచ్ బౌలింగ్‌కి అతిగా అనుకూలిస్తున్న నేపథ్యంలో.. 300పైచిలుకు లక్ష్యం ఛేదించడం కత్తిమీద సామే. ఈ నేపథ్యంలోనే.. ఇప్పటికే 346 ఆధిక్యంలో ఉన్న భారత్ వేగంగా ఆలౌట్ అయితే.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కంగారూలను బెంబేలెత్తించొచ్చని బుమ్రా ఆలోచన కాబోలు..!!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.