యాప్నగరం

వెస్టిండీస్ క్రికెటర్లకి కరోనా పాజిటివ్.. ఐసోలేషన్‌లో హోప్ బ్రదర్స్

వెస్టిండీస్ క్రికెటర్లు ఇద్దరు కరోనా వైరస్ బారినపడ్డారు. దేశవాళీ టోర్నీకి ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో వారిద్దరికీ కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దాంతో.. అక్కడి ప్రభుత్వం నిబంధనల ప్రకారం వారిని ఐసోలేషన్‌కి తరలించారు.

Samayam Telugu 27 Jan 2021, 1:09 pm
వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లు షై హోప్, కైల్ హోప్‌లు కరోనా వైరస్ బారినపడ్డారు. ఫిబ్రవరి 7 నుంచి విండీస్ గడ్డపై సూపర్ 50 కప్ ప్రారంభంకానుండగా.. ఈ టోర్నీ కోసం సిద్ధమవుతున్న హోప్ బ్రదర్స్ కరోనా వైరస్ బారినపడినట్లు క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) బుధవారం ప్రకటించింది. బార్బడోస్ ప్రభుత్వం నిబంధనల ప్రకారం.. హోప్ బ్రదర్స్‌ని ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచినట్లు సీడబ్ల్యూఐ స్పష్టం చేసింది.
Samayam Telugu Shai Hope, Kyle Hope (Image Source: Facebook)


2015లో వెస్టిండీస్ టీమ్‌లోకి అరంగేట్రం చేసిన షై హోప్ ఇప్పటి వరకూ 34 టెస్టులు, 76 వన్డేలు, 13 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. గత ఏడాది జులైలో ఇంగ్లాండ్‌తో చివరిగా టెస్టు మ్యాచ్ ఆడిన షై హోప్.. బార్బడోస్ టీమ్‌కి వికెట్ కీపర్‌గా ఉన్నాడు. అయితే.. తాజాగా అతను కరోనా వైరస్ బారిన పడటంతో.. 15 మంది ఉన్న జట్టు నుంచి అతడ్ని తప్పించి వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ తేవాన్ వాల్‌కాట్‌ని ఎంపిక చేశారు. అతని సోదరుడు కైల్ హోప్ స్థానంలో మాస్కీని సెలెక్ట్ చేశారు.

సూపర్ 50 కప్‌కి ముందు ఆటగాళ్లకి నిర్వహించిన కరోనా వైరస్ పరీక్షల్లో హోప్ బ్రదర్స్ వైరస్ బారిన పడినట్లు వెలుగులోకి వచ్చిందని బార్బడోస్ క్రికెట్ అసోషియేషన్ ప్రకటించింది. మొత్తం ఆరు జట్లు పోటీపడనున్న ఈ టోర్నీని రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహించనుండగా.. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 27న జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.