యాప్నగరం

కోహ్లీ ఇప్ప‌టికే నిరూపించుకున్నాడు

వెస్టిండీస్ దిగ్గజం ప్లేయర్ చంద్రపాల్‌.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట‌తీరు గురించి మాట్లాడాడు. కోహ్లీ ప్రపంచ క్రికెట్లో చాలా కాలంగా టాప్ లెవ‌ల్ ఆట‌ను ప్రదర్శిస్తున్నాడని కొనియాడాడు.

Samayam Telugu 22 Mar 2020, 6:42 pm
వెస్టిండీస్ లెజెండ‌రీ ప్లేయ‌ర్‌ శివ నారాయణ్‌ చంద్రపాల్.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పై ప్రశంసల జల్లు కురిపించాడు. సమకాలీన క్రికెట్లో కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడని కితాబిచ్చాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో ఆడేందుకు చంద్రపాల్ ఇటీవల భారత్‌కి వచ్చాడు. అయితే క‌రోనా వైరస్ కారణంగా ఆ సిరీస్ ర‌ద్దు అయింది. మరోవైపు మీడియాతో తన మనసులోని మాట పంచుకున్న చంద్రపాల్ కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తాడు. చాలా కాలంగా టాప్ లెవెల్ ప్రదర్శిస్తున్న కోహ్లీ.. శ్ర‌మ‌ను గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. మరోవైపు ఈ ఏడాది ఆస్ట్రేలియా జరిగే టీ20 పురుషుల వరల్డ్ కప్ గురించి కూడా ఆస‌క్తిక‌రంగా మాట్లాడాడు.
Samayam Telugu Bengaluru: Indias Skipper Virat Kohli with trophy after India won the third and...
India's Skipper Virat Kohli


Read Also: బౌలింగ్‌ స్పీడ్ ఎందుకు పెంచానంటే: భువీ

కోహ్లీ గురించి చంద్రపాల్‌ మాట్లాడుతూ క్రికెట్ లోని అన్ని అంశాల్లో తాను రోజురోజుకు మెరుగవుతున్నాడు అని ప్రశంసించాడు. వాటి ఫలితాలను మనం చూస్తున్నామనే విషయాన్ని గుర్తు చేశాడు. ఫిట్‌నెస్‌, స్కిల్స్ పైన చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడని కితాబిచ్చాడు. ఎల్లప్పుడూ అత్యుత్త‌మ ఆట‌తీరు ప్రదర్శించేందుకు కోహ్లీ తహతహలాడుతున్నాడని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే కోహ్లీ తన గురించి తాను నిరూపించుకున్నాడని, ఇకమీదట నిరూపించుకోవాల్సినదేమీ లేదని పేర్కొన్నాడు. క్రికెట్ లో చాలా కాలంగా టాప్ లెవెల్లో ఆడుతున్న కోహ్లీకి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. హార్డ్ వర్క్ పై దృష్టి పెడితే ఫలితాలు వాటంతట అవే వస్తాయని అత‌ను నిరూపించాడని పేర్కొన్నాడు.

Read Also: న‌మ్మండి..వీళ్లంతా ఐపీఎల్ చాంపియ‌న్లే!

ఇక ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియా జరిగే టి20 పురుషుల ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ రాణించాలని చంద్రపాల్ కోరుకున్నాడు. స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శిస్తే వెస్టిండీస్‌కు తిరుగుండదని అభిప్రాయపడ్డాడు. రికార్డు స్థాయిలో టీ20 ప్రపంచకప్‌ను విండీస్ రెండుసార్లు గెలుపొందింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా క‌రీబియ‌న్ టీమ్‌ నిలిచింది. 2016 లో భారత్‌లోనే జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి వెస్టిండీస్ గెలిచిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.