వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్గేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భారత్లో ఐపీఎల్ తరహాలో.. వెస్టిండీస్లో ఏటా జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టీ20 టోర్నీ నుంచి వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది తప్పుకుంటున్నట్లు క్రిస్గేల్ ప్రకటించాడు. 2013 నుంచి ఈ టోర్నీ జరుగుతుండగా.. క్రిస్గేల్ 2,344 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు.
నోరుజారి.. విమర్శలపాలైన క్రిస్గేల్:
జమైకా తలైవాస్ తరఫున గత ఏడాది ఆడిన క్రిస్గేల్ అంచనాల్ని అందుకోలేకపోయాడు. దాంతో.. సీపీఎల్ 2020 సీజన్ కోసం క్రిస్గేల్ అట్టిపెట్టుకోని తలైవాస్ జట్టు అతడ్ని వదిలేసింది. అలా తలైవాస్ ఫ్రాంఛైజీ తనని వదిలేయడానికి కారణం ఆ జట్టు సహాయ కోచ్ శర్వాన్ మాటలేనని క్రిస్గేల్ ఇటీవల ఆరోపించాడు.
‘‘శర్వాన్ నేను తలైవాస్ జట్టులో చోటు కోల్పోవడానికి కారణం నువ్వే. ఆ ఫ్రాంఛైజీకి నువ్వు చాలా క్లోజ్ అని నాకు తెలుసు. నీలో ఇప్పటికీ పరిణతి రాలేదు.. పగ పడుతున్నావు కదా..? నా పుట్టిన రోజు వేడుకలకి వచ్చి మన స్నేహ బంధం గురించి చాలా గొప్పగా మాట్లాడావు. కానీ.. ఇప్పటికీ వెన్నుపోటు పొడుస్తున్నావ్..? నువ్వు కరోనా కంటే ప్రమాదకారివి’’ అని క్రిస్గేల్ ఆరోపించాడు.
క్రిస్గేల్ విమర్శలపై జమైకా తలైవాస్ ఫ్రాంఛైజీ ఘాటుగా స్పందించింది. ప్రదర్శన బాగా లేదు కాబట్టే వేలంలోకి వదిలిపెట్టామని క్రిస్గేల్కి స్పష్టం చేసిన ఫ్రాంఛైజీ.. ఆటగాడి విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు మాకుందని చురకలేసింది. మొత్తంగా క్రిస్గేల్కి ఆ రిప్లై ఓ అవమానంలా అనిపించినట్లుంది. అందుకే సీపీఎల్ 2020 సీజన్కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
నోరుజారి.. విమర్శలపాలైన క్రిస్గేల్:
జమైకా తలైవాస్ తరఫున గత ఏడాది ఆడిన క్రిస్గేల్ అంచనాల్ని అందుకోలేకపోయాడు. దాంతో.. సీపీఎల్ 2020 సీజన్ కోసం క్రిస్గేల్ అట్టిపెట్టుకోని తలైవాస్ జట్టు అతడ్ని వదిలేసింది. అలా తలైవాస్ ఫ్రాంఛైజీ తనని వదిలేయడానికి కారణం ఆ జట్టు సహాయ కోచ్ శర్వాన్ మాటలేనని క్రిస్గేల్ ఇటీవల ఆరోపించాడు.
‘‘శర్వాన్ నేను తలైవాస్ జట్టులో చోటు కోల్పోవడానికి కారణం నువ్వే. ఆ ఫ్రాంఛైజీకి నువ్వు చాలా క్లోజ్ అని నాకు తెలుసు. నీలో ఇప్పటికీ పరిణతి రాలేదు.. పగ పడుతున్నావు కదా..? నా పుట్టిన రోజు వేడుకలకి వచ్చి మన స్నేహ బంధం గురించి చాలా గొప్పగా మాట్లాడావు. కానీ.. ఇప్పటికీ వెన్నుపోటు పొడుస్తున్నావ్..? నువ్వు కరోనా కంటే ప్రమాదకారివి’’ అని క్రిస్గేల్ ఆరోపించాడు.
క్రిస్గేల్ విమర్శలపై జమైకా తలైవాస్ ఫ్రాంఛైజీ ఘాటుగా స్పందించింది. ప్రదర్శన బాగా లేదు కాబట్టే వేలంలోకి వదిలిపెట్టామని క్రిస్గేల్కి స్పష్టం చేసిన ఫ్రాంఛైజీ.. ఆటగాడి విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు మాకుందని చురకలేసింది. మొత్తంగా క్రిస్గేల్కి ఆ రిప్లై ఓ అవమానంలా అనిపించినట్లుంది. అందుకే సీపీఎల్ 2020 సీజన్కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.